ETV Bharat / state

అనిశా వలలో ఇద్దరు అటవీ అధికారులు

author img

By

Published : Oct 22, 2019, 8:37 PM IST

ఇద్దరు అటవీ అధికారులు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా రేచపల్లిలో చోటుచేసుకుంది.

అనిశా వలలో ఇద్దరు అటవీ అధికారులు
అనిశా వలలో ఇద్దరు అటవీ అధికారులు
జగిత్యాల జిల్లా సారంగపూర్‌ మండలం రేచపల్లిలో పాత ఇంటిలో వాడిన కలపకు అనుమతి ఇచ్చే విషయంలో ఆరువేలు లంచం తీసుకుంటూ అటవీ సెక్షన్‌ ఆఫీసర్‌ పవనసుత రాజ్‌, బీట్‌ ఆఫీసర్‌ వసీం ఇద్దరు ఏసీబీ అధికారులకు చిక్కారు. మ్యాడారం తండాకు చెందిన బూక్య గంగాధర్‌ తన పాత ఇల్లును 30 రోజుల ప్రణాళికలో భాగంగా కూల్చివేశారు. కొత్తగా ఇల్లు నిర్మించుకునేందుకు పాత ఇంటిలోని కలప వాడకానికి అనుమతి ఇవ్వాలని కోరితే 20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీనితో బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించాడు. ఆరు వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ ప్రతాప్‌ పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు.

ఇదీ చూడండి:రేప్​ గురించి ఎంపీ భార్య చెప్పిన 'ఎంజాయ్​మెంట్​ థియరీ'

అనిశా వలలో ఇద్దరు అటవీ అధికారులు
జగిత్యాల జిల్లా సారంగపూర్‌ మండలం రేచపల్లిలో పాత ఇంటిలో వాడిన కలపకు అనుమతి ఇచ్చే విషయంలో ఆరువేలు లంచం తీసుకుంటూ అటవీ సెక్షన్‌ ఆఫీసర్‌ పవనసుత రాజ్‌, బీట్‌ ఆఫీసర్‌ వసీం ఇద్దరు ఏసీబీ అధికారులకు చిక్కారు. మ్యాడారం తండాకు చెందిన బూక్య గంగాధర్‌ తన పాత ఇల్లును 30 రోజుల ప్రణాళికలో భాగంగా కూల్చివేశారు. కొత్తగా ఇల్లు నిర్మించుకునేందుకు పాత ఇంటిలోని కలప వాడకానికి అనుమతి ఇవ్వాలని కోరితే 20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీనితో బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించాడు. ఆరు వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ ప్రతాప్‌ పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు.

ఇదీ చూడండి:రేప్​ గురించి ఎంపీ భార్య చెప్పిన 'ఎంజాయ్​మెంట్​ థియరీ'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.