ETV Bharat / state

చైతన్యపురిలో వంటగ్యాస్ పీల్చి యువకుడి ఆత్మహత్య

చైతన్యపురి పరిధిలోని యాదవనగర్‌లో ఓ యువకుడు బలవర్మణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట గ్యాస్​పైపు లీక్​ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

author img

By

Published : Jul 15, 2019, 6:39 PM IST

వంట గ్యాస్ పీల్చి యువకుడు బలవన్మరణం

హైదరాబాద్​ చైతన్యపురిలోని యాదవనగర్​ కాలనీ, మూడో నంబరు రోడ్డులో ఉన్న ఓ అపార్ట్​మెంటులో అనురాగ్​ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో నోట్లో గ్యాస్ పైప్ పెట్టుకుని తల మొత్తానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రులు దైవ దర్శనం కోసం తిరుపతి వెళ్లారు. చుట్టు పక్కల వారికి గ్యాస్ వాసన రావడం వల్ల మృతుని సమీప బంధువుకు సమాచారం ఇచ్చారు. అందరూ వచ్చి తలుపులు తెరిచి చూడగా అప్పటికే మృతిచెందాడు. మృతుడు ఓ బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

వంట గ్యాస్ పీల్చి యువకుడు బలవన్మరణం
ఇదీ చూడండి: గుప్త నిధుల కోసం ముగ్గురు దారుణ హత్య

హైదరాబాద్​ చైతన్యపురిలోని యాదవనగర్​ కాలనీ, మూడో నంబరు రోడ్డులో ఉన్న ఓ అపార్ట్​మెంటులో అనురాగ్​ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో నోట్లో గ్యాస్ పైప్ పెట్టుకుని తల మొత్తానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రులు దైవ దర్శనం కోసం తిరుపతి వెళ్లారు. చుట్టు పక్కల వారికి గ్యాస్ వాసన రావడం వల్ల మృతుని సమీప బంధువుకు సమాచారం ఇచ్చారు. అందరూ వచ్చి తలుపులు తెరిచి చూడగా అప్పటికే మృతిచెందాడు. మృతుడు ఓ బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

వంట గ్యాస్ పీల్చి యువకుడు బలవన్మరణం
ఇదీ చూడండి: గుప్త నిధుల కోసం ముగ్గురు దారుణ హత్య
Intro:హరిత హారంలో నాటే ప్రతి మొక్కకు ఇకముందు పూర్తిస్థాయి సంరక్షణ చేపట్టే బాధ్యత గ్రామ పంచాయతీల పాలక వర్గాలు స్వీకరించాలని జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత పేర్కొన్నారు. మండల పరిషత్ జలశక్తి సదస్సులో ప్రసంగించారు. వన సంరక్షణతోనే జనసంరక్షణ ఆధారపడిందని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. జలసంరక్షణకు ఇంకుడు గుంతల నిర్మాణం నూరు శాతం చేపట్టి కురిసే ప్రతి నీటి బొట్టును సంరక్షించాలని కోరారు. మొక్కల పెంపకం, జలసంరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణపై నిర్లక్ష్యం ప్రదర్శించిన వారికి జరిమానా విధించడానికి వెనుకాడ వద్దని సూచించారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ నాటిన మొక్కల సంరక్షణకు ట్రీగార్డుల ఏర్పాటుకు చట్టం రూపొందించే విధంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తానని వెల్లడించారు. లక్షల సంఖ్యలో మొక్కలు నాటే బదులు వేలల్లో నాటి పూర్తిగా పెరిగే విధంగా శ్రద్ధ చూపాలన్నారు. సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు మొక్కల సంరక్షణకు ఉపాధిహామీ నిధులు వెచ్చించాలని కోరారు. మండల పరిషత్ అధ్యక్షురాలు
మేనేని స్వర్ణలత, జెడ్ పి టి సి సభ్యురాలు పునుగోటి ప్రశాంతి హరితహారం పై పలు సూచనలు చేశారు. చివరగా స్థానిక ప్రజా ప్రతినిధులతో జల సంరక్షణ పై ప్రతిజ్ఞ చేశారు.


Body:సయ్యద్ రహమత్ , చొప్పదండి


Conclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.