ETV Bharat / state

మాసబ్​ట్యాంక్​ వద్ద మల్కాపూర్ రైతుల ధర్నా.. - telangana latest news

మాసబ్​ట్యాంక్‌ వద్ద యాదాద్రి జిల్లా మల్కాపూర్‌ గిరిజన రైతులు ఆందోళనకు దిగారు. ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములను అప్పగించాలంటూ అటవీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.

yadadri farmers protest at masabtank for their lands
మాసబ్​ట్యాంక్​ వద్ద మల్కాపూర్ రైతుల ధర్నా.. ఎందుకంటే?
author img

By

Published : Mar 1, 2021, 10:06 PM IST

మాసబ్​ట్యాంక్​ వద్ద మల్కాపూర్ రైతుల ధర్నా.. ఎందుకంటే?

హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవనం ఎదుట యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపూర్‌కు చెందిన గిరిజన రైతులు ధర్నా చేశారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని వెనక్కి ఇచ్చేయాలంటూ అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

1983 నుంచి 2005 వరకు వివిధ దఫాల్లో ప్రభుత్వం భూములు పంపిణీ చేసిందని అన్నదాతలు పేర్కొన్నారు. వాటికి పట్టాలు సైతం జారీ చేశారని వెల్లడించారు. అయినా ఆ భూములు అటవీ శాఖవేనని అధికారులు నోటీసులు ఇచ్చినట్లు వాపోయారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్‌ హామీ ఇచ్చినట్లు బాధితులు వెల్లడించారు.

ఇదీ చూడండి: ఇప్పటి వరకు 70 లక్షల సభ్యత్వాలు వచ్చాయి: కేటీఆర్​​

మాసబ్​ట్యాంక్​ వద్ద మల్కాపూర్ రైతుల ధర్నా.. ఎందుకంటే?

హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవనం ఎదుట యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపూర్‌కు చెందిన గిరిజన రైతులు ధర్నా చేశారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని వెనక్కి ఇచ్చేయాలంటూ అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

1983 నుంచి 2005 వరకు వివిధ దఫాల్లో ప్రభుత్వం భూములు పంపిణీ చేసిందని అన్నదాతలు పేర్కొన్నారు. వాటికి పట్టాలు సైతం జారీ చేశారని వెల్లడించారు. అయినా ఆ భూములు అటవీ శాఖవేనని అధికారులు నోటీసులు ఇచ్చినట్లు వాపోయారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్‌ హామీ ఇచ్చినట్లు బాధితులు వెల్లడించారు.

ఇదీ చూడండి: ఇప్పటి వరకు 70 లక్షల సభ్యత్వాలు వచ్చాయి: కేటీఆర్​​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.