తలాక్ భయంతో ఆత్మహత్యాయత్నం విడాకులు ఇస్తానంటూ నిరంతరం భర్త చేస్తున్న వేధింపులు భరించలేక హుస్సేన్ సాగర్ లో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి దూకపోయింది. చివరి నిమిషంలో చూసిన స్థానికులు.. వారిని కాపాడి పోలీసులకు అప్పగించారు.
హైదరాబాద్ టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహిళ.. తన పిల్లల చేతులకు తాడుతో కట్టేసి, ఆమె నడుముకు కట్టుకుని నీటిలోకి దూకేందుకు యత్నించింది. వారిని లేక్ పోలీస్ స్టేషన్కు తరలించగా, కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. భరోసా కేంద్రానికి పంపించి ఆమెకు న్యాయం చేస్తామని సీఐ ధనలక్ష్మీ తెలిపారు.