రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం కేశంపేట్ పరిధిలోని ఓ వ్యవసాయ భూమిలో కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. పొలంలోని ఓ గదిలో ఈ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాం పూర్తిగా కుళ్లిపోయినందున అక్కడే శవపరీక్ష నిర్వహించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అనంతరం గదిని సీజ్ చేయనున్నారు. చనిపోయిన వ్యక్తి ఎవరన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రం హీరో నాగార్జునదిగా ప్రచారం జరుగుతోంది.
ఇవీచూడండి: ఇల్లు తగలబెట్టిన ఎలుక