ETV Bharat / state

నిర్వహణ అధ్వాన్నం... గ్రామాలకు శాపం.!

author img

By

Published : Aug 13, 2020, 12:08 PM IST

ఏళ్లు గడుస్తున్నా జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డు కాలుష్యం తగ్గట్లేదు. చుట్టుపక్కల 18 గ్రామాల ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారు. దుర్వాసనతో శ్వాస తీసుకోలేక, వాడుకోలేని విధంగా తయారైన భూగర్భ జలాలతో అవస్థలు పడుతున్నారు. కొంత విస్తీర్ణంలో పంట పొలాలూ విషతుల్యమయ్యాయి. వ్యర్థాల నిర్వహణ లోపాలే అందుకు కారణమని గగ్గోలుపెడుతున్నారు. డంపింగ్‌యార్డు నుంచి విడుదలయ్యే మురుగునీటితో పక్కనున్న 50 ఎకరాల మల్కారం చెరువు రసాయన సాగరాన్ని తలపిస్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్ఛు. అందుకు సంబంధించిన లోపాలపై ఈపీటీఆర్‌ఐ(పర్యావరణ పరిరక్షణ, శిక్షణ పరిశోధన సంస్థ) గతేడాది చివరి త్రైమాసికంలోనూ నివేదిక రూపొందించింది. దాని ఆధారంగా రాంకీ సంస్థకు జీహెచ్‌ఎంసీ రూ.1.79 కోట్ల జరిమానా విధించడం గమనార్హం.

Pollution in Hyderabad
నిర్వహణ అధ్వానం.. గ్రామాలకు శాపం!

జవహర్‌ డంపింగ్‌ యార్డు 351 ఎకరాల్లో ఉంది. 14 మిలియన్‌ టన్నుల వ్యర్థాలు కొండల్లా పేరుకుపోయాయి. వేర్వేరు పొరలుగా కప్పేసి, గడ్డి మొలిచేలా చేసే క్యాపింగ్‌ పనులు మార్చి 2018కి పూర్తికావాల్సి ఉండగా.. ఇప్పటికీ ప్రక్రియ కొనసాగుతోంది. జాప్యంతో చుట్టుపక్కల వాతావరణం కాలుష్యమయమైంది. నగర శివారు ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. ఇక్కడ ఆ పరిస్థితి కనిపించదు. ఓ వైపు దుర్వాసన, మరోవైపు గాలికి జనావాసాలపై ఎగిరొచ్చి పడే చిత్తు కాగితాలు, ప్లాస్టిక్‌ సంచులు, పక్షులు పడేసే వ్యర్థాలతోనే సమీప ప్రాంతాల జన ఇబ్బంది పడుతుంటే.. వ్యర్థాల కొండల నుంచి విడుదలయ్యే మురుగునీటితో భూగర్భ జలం కలుషితమవుతోంది. ఒప్పందం ప్రకారం ఈ దుష్పరిణామాలను రాంకీ సంస్థ ఎప్పటికప్పుడు నియంత్రిస్తుండాలి. కానీ పూర్తిస్థాయిలో జరగట్లేదని జీహెచ్‌ఎంసీయే చెబుతోంది. ‘‘అందుకు సంబంధించిన ప్రక్రియపై స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ ఇంజినీరింగ్‌ సంస్థ ఈపీటీఆర్‌ఐ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుంది. మూడు నెలలకోసారి నివేదిక ఇస్తుంది. డంపింగ్‌యార్డు నిర్వహణ ఒప్పందం ప్రకారం జరుగుతోందా, లేదా అనే అంశాలను ప్రస్తావిస్తుంది.’’ అని బల్దియా అధికారులు చెబుతున్నారు. నవంబరు, 2019 నుంచి జనవరి, 2020 కాలానికి ఇచ్చిన నివేదికలో వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణతోపాటు మరో రెండు అంశాల్లో నిర్వహణ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఈపీటీఆర్‌ఐ స్పష్టం చేసింది.

చెరువు శుద్ధికి అంతర్జాతీయ టెండర్లు

మల్కారం చెరువులో 600 మిలియన్‌ లీటర్ల గాఢ మురుగు జలం ఉంది. చెరువు నీటి శుద్ధికి ఏర్పాటు చేసిన రెండు 2 ఎంఎల్‌డీ సామర్థ్యం గల శుద్ధి కేంద్రాలు 70 శాతం మురుగునీటిని స్వచ్ఛంగా మార్చడానికి బదులు, 50 శాతం మార్చుతుండటంతో చెరువులోని నీరు అలాగే నిల్వ ఉంది. తాజాగా అంతర్జాతీయ టెండర్లు పిలిచామని, పెద్ద శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి మూడు దశల్లో తటాకంలోని గాఢ మురుగు జలాలను శుద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. చివరి దశలో కఠినాతి కఠినమైన మురుగు మిగులుతుందని, దాన్ని ఎంఈఈ-ఏటీఎఫ్‌డీ(మల్టీ ఎఫెక్ట్‌ ఎవాపరేటర్‌-అజిటేటెడ్‌ తిన్‌ ఫిల్మ్‌ డ్రైయర్‌) విధానంలో బూడిద చేసి డంపింగ్‌యార్డులో పాతిపెడతామని వెల్లడించారు. అప్పుడే చెరువు పునరుద్ధరణ సాధ్యమవుతుందని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. గ్లోబల్‌ టెండర్లలో రెండు సంస్థలు పాల్గొన్నాయని, ఇప్పుడు ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాశామని తెలిపారు.

ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్‌

జవహర్‌ డంపింగ్‌ యార్డు 351 ఎకరాల్లో ఉంది. 14 మిలియన్‌ టన్నుల వ్యర్థాలు కొండల్లా పేరుకుపోయాయి. వేర్వేరు పొరలుగా కప్పేసి, గడ్డి మొలిచేలా చేసే క్యాపింగ్‌ పనులు మార్చి 2018కి పూర్తికావాల్సి ఉండగా.. ఇప్పటికీ ప్రక్రియ కొనసాగుతోంది. జాప్యంతో చుట్టుపక్కల వాతావరణం కాలుష్యమయమైంది. నగర శివారు ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. ఇక్కడ ఆ పరిస్థితి కనిపించదు. ఓ వైపు దుర్వాసన, మరోవైపు గాలికి జనావాసాలపై ఎగిరొచ్చి పడే చిత్తు కాగితాలు, ప్లాస్టిక్‌ సంచులు, పక్షులు పడేసే వ్యర్థాలతోనే సమీప ప్రాంతాల జన ఇబ్బంది పడుతుంటే.. వ్యర్థాల కొండల నుంచి విడుదలయ్యే మురుగునీటితో భూగర్భ జలం కలుషితమవుతోంది. ఒప్పందం ప్రకారం ఈ దుష్పరిణామాలను రాంకీ సంస్థ ఎప్పటికప్పుడు నియంత్రిస్తుండాలి. కానీ పూర్తిస్థాయిలో జరగట్లేదని జీహెచ్‌ఎంసీయే చెబుతోంది. ‘‘అందుకు సంబంధించిన ప్రక్రియపై స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ ఇంజినీరింగ్‌ సంస్థ ఈపీటీఆర్‌ఐ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుంది. మూడు నెలలకోసారి నివేదిక ఇస్తుంది. డంపింగ్‌యార్డు నిర్వహణ ఒప్పందం ప్రకారం జరుగుతోందా, లేదా అనే అంశాలను ప్రస్తావిస్తుంది.’’ అని బల్దియా అధికారులు చెబుతున్నారు. నవంబరు, 2019 నుంచి జనవరి, 2020 కాలానికి ఇచ్చిన నివేదికలో వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణతోపాటు మరో రెండు అంశాల్లో నిర్వహణ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఈపీటీఆర్‌ఐ స్పష్టం చేసింది.

చెరువు శుద్ధికి అంతర్జాతీయ టెండర్లు

మల్కారం చెరువులో 600 మిలియన్‌ లీటర్ల గాఢ మురుగు జలం ఉంది. చెరువు నీటి శుద్ధికి ఏర్పాటు చేసిన రెండు 2 ఎంఎల్‌డీ సామర్థ్యం గల శుద్ధి కేంద్రాలు 70 శాతం మురుగునీటిని స్వచ్ఛంగా మార్చడానికి బదులు, 50 శాతం మార్చుతుండటంతో చెరువులోని నీరు అలాగే నిల్వ ఉంది. తాజాగా అంతర్జాతీయ టెండర్లు పిలిచామని, పెద్ద శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి మూడు దశల్లో తటాకంలోని గాఢ మురుగు జలాలను శుద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. చివరి దశలో కఠినాతి కఠినమైన మురుగు మిగులుతుందని, దాన్ని ఎంఈఈ-ఏటీఎఫ్‌డీ(మల్టీ ఎఫెక్ట్‌ ఎవాపరేటర్‌-అజిటేటెడ్‌ తిన్‌ ఫిల్మ్‌ డ్రైయర్‌) విధానంలో బూడిద చేసి డంపింగ్‌యార్డులో పాతిపెడతామని వెల్లడించారు. అప్పుడే చెరువు పునరుద్ధరణ సాధ్యమవుతుందని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. గ్లోబల్‌ టెండర్లలో రెండు సంస్థలు పాల్గొన్నాయని, ఇప్పుడు ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాశామని తెలిపారు.

ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.