TDP 40 Years Celebrations: తెలుగు దేశం పార్టీ 40వ ఆవర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు తెలిపారు. ఎన్టీఆర్ భవన్లో పార్టీ సీనియర్ నేతలతో కలిసి వేడుకల వివరాలు వెల్లడించారు.
ఈనెల 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్.. పార్టీ ప్రకటించిన ప్రాంతం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చంద్రబాబు చేరుకొని నివాళి అర్పిస్తారని చెప్పారు. అనంతరం సాయంత్రం సుమారు ఆరు గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
ఇదీచూడండి: 'నూకలు తినమని అవమానపరిచిన భాజపా ప్రభుత్వానికి నూకలు చెళ్లేలా చేయాలి'