ETV Bharat / state

ts rtc: సమష్టి కృషితోనే ఆర్టీసీ అభివృద్ధి: మంత్రి పువ్వాడ - తెలంగాణ తాజా వార్తలు

కొవిడ్ మహమ్మారి కారణంగా తెలంగాణ ఆర్టీసీకి రూ.2,600ల కోట్ల నష్టం వచ్చిందని.. రవాణాశాఖ (transport minister) మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. సమష్టి కృషితోనే ఆర్టీసీ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ts rtc
ts rtc
author img

By

Published : Aug 15, 2021, 5:01 AM IST

Updated : Aug 15, 2021, 8:45 AM IST

కరోనా ప్రభావంతో తెలంగాణ ఆర్టీసీకి రూ. 2,600 కోట్ల నష్టం వచ్చిందని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ (puvvada ajay kumar)వెల్లడించారు. సమష్టి కృషితోనే ఆర్టీసీ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. రవాణాశాఖ మంత్రి, సంస్థ ఎండీ, ఈడీలు, ఉన్నతాధికారులు, సూపర్ వైజర్లు, ఉద్యోగులందరూ కలిసికట్టుగా పనిచేస్తూ సంస్థను అభివృద్ధిలోకి తేవడానికి కృషి చేస్తున్నారని వివరించారు. రవాణాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, సీఎండీలతో చర్చించిన తర్వాత సరైన నిర్ణయాలు తీసుకోనున్నట్టు మంత్రి పేర్కొన్నారు.

టీఎస్‌ ఆర్టీసీకి సీఎం కేసీఆర్‌ ఆశీస్సులు, ప్రభుత్వం హామీ మేరకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.1000కోట్ల రుణం ఇవ్వడానికి ఒప్పుకుందన్నారు. మొదటి దఫాగా రూ.500 కోట్లు విడుదల చేసిందని, మిగతా రూ.500ల కోట్లు ఒక నెల తర్వాత ఇస్తామన్నరని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత ఆయన సూచన మేరకు ఈ డబ్బులను ప్రాధాన్యతను బట్టి అవసరమైన వాటికి వినియోగించనున్నట్టు చెప్పారు.

Last Updated : Aug 15, 2021, 8:45 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.