హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఆచార్య జయశంకర్ చిత్ర పటానికి టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గంటా చక్రపాణ పూలతో నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ సభ్యులు, ఉద్యోగులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. భౌతిక దూరం పాటిస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఇదీ చూడండి : రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్