ETV Bharat / state

పీవీకి నివాళులర్పించిన పలు దేశాల ఎన్నారైలు

author img

By

Published : Jun 29, 2020, 10:47 PM IST

ప్రపంచవ్యాప్తంగా పీవీ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీవీకి ప్రవాస భారతీయులు నివాళులర్పించారు. ఏడాదిపాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు.

ts nris people pay tribute to pv narasimha rao
పీవీకి నివాళులర్పించిన పలు దేశాల ఎన్నారైలు
పీవీకి నివాళులర్పించిన పలు దేశాల ఎన్నారైలు

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాల్టా, స్వీడన్​లో, ఒమాన్​లో, అమెరికాలోని బోస్టన్​లో, లండన్​లో, ఆస్ట్రియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా పీవీని గౌరవించేలా 50 దేశాల్లో ఏడాదిపాటు శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్​కు ఎన్.ఆర్.ఐలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

స్వీడన్​లో..

అపర చాణుక్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు స్వీడన్​లో సంబురంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వీడన్ తెలుగు అసోసియేషన్ సభ్యులతో కలిసి తెలుగు వారంతా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించారు. ఆస్ట్రియా తెలుగు అసోసియేషన్ తరపున వంశీరెడ్డి ఆధ్వర్యంలో పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఒమాన్​లో తెలంగాణ ఎన్నారై సెల్ ఒమాన్ శాఖ, తెలంగాణ జాగృతి ఒమాన్ శాఖలు సంయుక్తంగా పీవీ నర్సింహారావు శాతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు.

లండన్​లో పీవీ..

అమెరికాలోని బోస్టన్ నగరంలో పలువురు ఎన్నారైలు పీవీకి నివాళులు అర్పించారు. తెలంగాణ జాగృతి యూనైటెడ్​ కింగ్డమ్ ఆధ్వర్యంలో పీవీ జయంతిని జరిపారు. తెలంగాణ జాగృతి బహ్రెయిన్ ఆధ్వర్యంలో, లండన్​లో పీవీ జయంతి ఉత్సవాలు జరిపారు. లండన్​లో జరిగిన పీవీ జయంతి ఉత్సవాల్లో లోక్​సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్, వాణిదేవి, మహేష్ బిగాల, లండన్ ఎంపీలు పాల్గొన్నారు. యూకే, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, దుబాయ్, వివిధ దేశాల నుంచి శాస్త్రవేత్తలు, బారిస్టర్​లు, డాక్టర్​లు, విద్యావేత్తలు, సాఫ్ట్ వీర్ నిపుణులు, భారత సంతతి యూకే రాజకీయ ప్రతినిధులు, తెలంగాణ, తెలుగు సంఘాల ప్రతినిధులు 9 టీడీఫ్, జాగృతి, యుక్త , తాల్, తార, ఇలా వివిధ రంగాలకు చెందిన 130 మంది ఎన్నారైలు పాల్గొన్నారు. ప్రసంగాల అనంతరం జయప్రకాశ్, వాణిదేవిలతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు.

ఇదీ చూడండి : ప్రత్యేక ప్రణాళిక రూపొందించండి.. కేంద్ర బృందం సూచన

పీవీకి నివాళులర్పించిన పలు దేశాల ఎన్నారైలు

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాల్టా, స్వీడన్​లో, ఒమాన్​లో, అమెరికాలోని బోస్టన్​లో, లండన్​లో, ఆస్ట్రియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా పీవీని గౌరవించేలా 50 దేశాల్లో ఏడాదిపాటు శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్​కు ఎన్.ఆర్.ఐలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

స్వీడన్​లో..

అపర చాణుక్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు స్వీడన్​లో సంబురంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వీడన్ తెలుగు అసోసియేషన్ సభ్యులతో కలిసి తెలుగు వారంతా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించారు. ఆస్ట్రియా తెలుగు అసోసియేషన్ తరపున వంశీరెడ్డి ఆధ్వర్యంలో పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఒమాన్​లో తెలంగాణ ఎన్నారై సెల్ ఒమాన్ శాఖ, తెలంగాణ జాగృతి ఒమాన్ శాఖలు సంయుక్తంగా పీవీ నర్సింహారావు శాతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు.

లండన్​లో పీవీ..

అమెరికాలోని బోస్టన్ నగరంలో పలువురు ఎన్నారైలు పీవీకి నివాళులు అర్పించారు. తెలంగాణ జాగృతి యూనైటెడ్​ కింగ్డమ్ ఆధ్వర్యంలో పీవీ జయంతిని జరిపారు. తెలంగాణ జాగృతి బహ్రెయిన్ ఆధ్వర్యంలో, లండన్​లో పీవీ జయంతి ఉత్సవాలు జరిపారు. లండన్​లో జరిగిన పీవీ జయంతి ఉత్సవాల్లో లోక్​సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్, వాణిదేవి, మహేష్ బిగాల, లండన్ ఎంపీలు పాల్గొన్నారు. యూకే, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, దుబాయ్, వివిధ దేశాల నుంచి శాస్త్రవేత్తలు, బారిస్టర్​లు, డాక్టర్​లు, విద్యావేత్తలు, సాఫ్ట్ వీర్ నిపుణులు, భారత సంతతి యూకే రాజకీయ ప్రతినిధులు, తెలంగాణ, తెలుగు సంఘాల ప్రతినిధులు 9 టీడీఫ్, జాగృతి, యుక్త , తాల్, తార, ఇలా వివిధ రంగాలకు చెందిన 130 మంది ఎన్నారైలు పాల్గొన్నారు. ప్రసంగాల అనంతరం జయప్రకాశ్, వాణిదేవిలతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు.

ఇదీ చూడండి : ప్రత్యేక ప్రణాళిక రూపొందించండి.. కేంద్ర బృందం సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.