ETV Bharat / state

నిరాడంబరంగా తెరాస ఆవిర్భావ వేడుకలు

author img

By

Published : Apr 27, 2021, 7:26 PM IST

తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో నిరాడంబరంగా నిర్వహించారు. హైదరాబాద్ నాగోల్​లోని ఆయన నివాసం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు.

trs formation day celebrations
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్​ ఆధ్వర్యంలో తెరాస ఆవిర్భావ వేడుకలు

తెరాస 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా... రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పార్టీ జెండాను ఆవిష్కరించారు. కొవిడ్​ నేపథ్యంలో హైదరాబాద్ నాగోల్​లోని ఆయన నివాసం వద్ద... పార్టీ శ్రేణులతో కలిసి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు.

పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ రెడ్డి, నాగోల్ డివిజన్ తెరాస అధ్యక్షుడు సతీశ్​ యాదవ్తో​ పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తెరాస 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా... రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పార్టీ జెండాను ఆవిష్కరించారు. కొవిడ్​ నేపథ్యంలో హైదరాబాద్ నాగోల్​లోని ఆయన నివాసం వద్ద... పార్టీ శ్రేణులతో కలిసి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు.

పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ రెడ్డి, నాగోల్ డివిజన్ తెరాస అధ్యక్షుడు సతీశ్​ యాదవ్తో​ పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: బంగారు తెలంగాణ తెరాసతోనే సాధ్యం: ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.