పార్టీ నుంచి పాల్వాయి హరీశ్ను బహిష్కరిస్తునట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి ప్రకటించారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు.. నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హరీశ్.. కమల తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతుండటంతో.. కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పాల్వాయి హరీశ్.. కాంగ్రెస్ అభ్యర్థిగా 2018 అసెంబ్లీ ఎన్నికలో సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేశారు. ప్రముఖ నేతల వరుస రాజీనామాలతో ఇప్పటికే ఆ పార్టీ బలహీనపడుతూ వస్తోంది.
ఇదీ చదవండి: రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల సందడి