- మరో 1,724 కరోనా కేసులు
రాష్ట్రంలో తాజాగా 1,724 మందికి కారోనా సోకగా 10 మంది మృతి చెందారు. మొత్తం 97,424 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇప్పటి వరకు 729 మంది మరణించారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- మళ్లీ వరద పోటు..
భద్రాచలంలో వరద ప్రవాహం మళ్లీ పెరుగుతుంది. 19 అడుగుల మేర తగ్గిన గోదావరి మరల ఉరకలేస్తోంది. ఉదయం 7 గం.కు వరకు నీటిమట్టం 43.1 అడుగులకు చేరింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- హైదరాబాద్లో 6.6 లక్షల మందికి కరోనా!
నగరంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఊహించినదానికంటే ఎక్కువే ఉందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానమిస్తున్నాయి కొన్ని సంస్థలు. వారి పరిశోధనల్లో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయంటున్నారు. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో వైరస్ సమానంగా వ్యాప్తి చెందిందని ఐఐసీటీ, సీసీఎంపీ సంయుక్త పరిశోధనలో తేలింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- ఆశలు రేపుతున్న కొవాగ్జిన్...
కరోనా టీకా విడుదలకు సంబంధించి కీలక ప్రక్రియలు ఒక్కోటిగా పూర్తవుతున్నాయి. హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ అభివృద్ధి చేసిన టీకా ‘కొవాగ్జిన్’ క్లినికల్ ట్రయల్స్ నిమ్స్లో కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- 'అక్కడే తేల్చుకుందాం...
రాష్ట్ర ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్తో పాటు.. కేంద్రం లేవనెత్తిన అర్థం పర్థంలేని సందేహాలన్నింటినీ ఆధారాలతో సహా.. అపెక్స్ కౌన్సిల్ వేదికగా నివృత్తి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుతో పాటు.. రాయలసీమ ఎత్తిపోతలపై గట్టిగా అభ్యంతరం చెప్పాలని నిర్ణయించారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- టీవీ పాఠాలు లేనట్లే...
గురువారం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు టీవీ పాఠాలు మొదలుపెట్టాలని విద్యాశాఖ నిర్ణయించినా... అవి అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపకపోవడమే దీనికి ప్రధాన కారణం. పూర్తి వివరాకై క్లిక్ చేయండి
- నేడు 'స్వచ్ఛ' అవార్డుల ప్రకటన
'స్వచ్ఛ సర్వేక్షణ్' కార్యక్రమంలో భాగంగా 2020కి గాను గురువారం పరిశుభ్రత అవార్డులను ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించనున్నారు. మొత్తం 129 అవార్డులను అగ్రశ్రేణి నగరాలు, రాష్ట్రాలకు అందజేయనున్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- ఎయిర్ఇండియాపై హాంకాంగ్ నిషేధం!
కొవిడ్ నిబంధనలు పాటించలేదన్న కారణంతో ఎయిర్ఇండియాపై హాంకాంగ్ రెండు వారాల పాటు నిషేధం విధించింది. ప్రయాణికుల్లో కొందరికి కరోనా పాజిటివ్ అని నిర్ధరణ కావడం వల్ల హాంకాంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- ఆప్పుడే కన్నుమూస్తా!'
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు. ఈ సందర్భంగా ధోనీతో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నాడు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- 'పండగలొస్తే అవే గుర్తుకు వస్తాయి'
సినీ తారలు ఎప్పుడూ షూటింగ్లతో బిజీగా గడుపుతుంటారు. అయితే తీరిక లేని సమయాల్లోనూ ఇంట్లో పండగలు ఎలా జరుపుకొంటారని పూజా హెగ్డేను ప్రశ్నించగా ఇలా స్పందించింది.