ETV Bharat / state

టీఎన్జీవో నూతన అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్ - tngo latest updates

టీఎన్జీవో నూతన అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్ బాధ్యతలు స్వీకరించారు. మర్యాదపూర్వకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సచివాలయంలో కలిశారు.

టీఎన్జీవో నూతన అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్
టీఎన్జీవో నూతన అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్
author img

By

Published : Sep 3, 2020, 8:23 PM IST

టీఎన్జీవో నూతన అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్ బాధ్యతలు స్వీకరించారు. మర్యాదపూర్వకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సచివాలయంలో కలిశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ తో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నుకోబడిన టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ను సోమేశ్ కుమార్ అభినందించారు. ఇపుడు ఆయన బాధ్యత పెరిగిందని... ఉద్యోగులు ఆయన మీద ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉండాలన్నారు.

ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని సీఎస్ కోరారు. ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి... త్వరలో ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సీఎస్ వారికి హామీ ఇచ్చారు.

టీఎన్జీవో నూతన అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్ బాధ్యతలు స్వీకరించారు. మర్యాదపూర్వకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సచివాలయంలో కలిశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ తో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నుకోబడిన టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ను సోమేశ్ కుమార్ అభినందించారు. ఇపుడు ఆయన బాధ్యత పెరిగిందని... ఉద్యోగులు ఆయన మీద ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉండాలన్నారు.

ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని సీఎస్ కోరారు. ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి... త్వరలో ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సీఎస్ వారికి హామీ ఇచ్చారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.