ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ, ఈ రంగంలో పెరుగుతున్న ఉద్యోగావకాశాలను దృష్టిలో పెట్టుకొని.. ఏఐ విభాగంలో మరింత శిక్షణనివ్వనున్నట్లు టీటా డిజిథాన్ ప్రకటించింది. గతంలో ఏఐపై ఇంటర్న్షిప్ సహిత శిక్షణనిచ్చిన టీటా.. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఏఐ - 2021 శిక్షణనివ్వనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 22 నుంచి శిక్షణ ప్రారంభం కానుందని.. కోర్సులో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్, చాట్బాట్, మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వంటి అంశాలపై కోచింగ్ ఇస్తామని పేర్కొంది.
రెండు నెలల కోర్సులో ఉత్తీర్ణత పొందిన వారికి అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డెల్లాస్ ద్వారా శిక్షణాపత్రం ఇవ్వనున్నారు. బయట రూ. లక్షల్లో ఖర్చయ్యే ఈ కోర్సును నామమాత్రపు ఫీజుతోనే అందిస్తామని స్పష్టం చేసింది. వివరాలకు bit.ly/digithon_academy సైట్ను సందర్శించాలని టీటా సూచించింది.
ఇదీ చదవండి: ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ: కోదండరాం