ETV Bharat / state

ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. నేడు పీఆర్సీ ప్రకటించే అవకాశం

author img

By

Published : Mar 21, 2021, 9:45 PM IST

Updated : Mar 22, 2021, 12:09 AM IST

ప్రభుత్వ ఉద్యోగులకు నేడు వేతన సవరణ సహా ఇతర వరాలు ప్రకటించే అవకాశం ఉంది. పీఆర్సీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మరోమారు సమావేశమయ్యారు. సంబంధిత అంశాలపై చర్చించారు. సంబంధిత అంశాలపై 30 శాతానికి అటు ఇటుగా వేతన సవరణ ఉండవచ్చని అంచనా.

The PRC is likely to announce tomorrow in telangana
ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. రేపు పీఆర్సీ ప్రకటించే అవకాశం

ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల నిరీక్షణ సోమవారం ఫలించే అవకాశం కనిపిస్తోంది. వేతన సవరణపై త్వరలోనే ప్రకటన చేస్తానని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానం ఇచ్చిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో బడ్జెట్ ప్రసంగంలో, కేటాయింపుల్లో పీఆర్సీ ప్రస్తావన ఎక్కడా చేయలేదు. అటు నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో వేతన సవరణ ప్రకటించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. ప్రభుత్వ విజ్ఞప్తిపై స్పందించిన ఈసీ.. పీఆర్సీ ప్రకటనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది.

ఎన్నికల సంఘం అనుమతి నేపథ్యంలో వేతన సవరణ సహా సంబంధిత అంశాలపై ప్రకటన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఉద్యోగ సంఘాల నేతలు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్​లో ఆదివారం మరోమారు సమావేశమయ్యారు. పీఆర్సీ, పదవీ విరమణ వయస్సు పెంపు సహా ఇతర అంశాలపై చర్చించారు. ఇందుకు సంబంధించి శాసనసభలో ఇవాళ సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

30 శాతానికి అటుఇటుగా..

పీఆర్సీ, పదవీ విరమణ వయస్సు పెంపు, సీపీఎస్ ఉద్యోగుల ఫ్యామిలీ పింఛన్, ఈహెచ్ఎస్ తదితర అంశాలన్నీ ముఖ్యమంత్రి ప్రకటనలో ఉండే అవకాశం ఉంది. ఆర్థికశాఖ కేటాయింపుల్లో రూ.8 వేల కోట్లను ప్రత్యేకంగా పెట్టారు. పీఆర్సీ కోసమే ఈ నిధులను సిద్ధంగా ఉంచారు. ఆంధ్రప్రదేశ్​లో 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చిన నేపథ్యంలో అంతకంటే ఎక్కువే పీఆర్సీ ఉంటుందని ఇటీవల ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం ఉద్యోగసంఘాల నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో 30 శాతానికి అటుఇటుగా వేతన సవరణ ప్రకటించవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి: పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి

ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల నిరీక్షణ సోమవారం ఫలించే అవకాశం కనిపిస్తోంది. వేతన సవరణపై త్వరలోనే ప్రకటన చేస్తానని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానం ఇచ్చిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో బడ్జెట్ ప్రసంగంలో, కేటాయింపుల్లో పీఆర్సీ ప్రస్తావన ఎక్కడా చేయలేదు. అటు నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో వేతన సవరణ ప్రకటించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. ప్రభుత్వ విజ్ఞప్తిపై స్పందించిన ఈసీ.. పీఆర్సీ ప్రకటనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది.

ఎన్నికల సంఘం అనుమతి నేపథ్యంలో వేతన సవరణ సహా సంబంధిత అంశాలపై ప్రకటన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఉద్యోగ సంఘాల నేతలు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్​లో ఆదివారం మరోమారు సమావేశమయ్యారు. పీఆర్సీ, పదవీ విరమణ వయస్సు పెంపు సహా ఇతర అంశాలపై చర్చించారు. ఇందుకు సంబంధించి శాసనసభలో ఇవాళ సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

30 శాతానికి అటుఇటుగా..

పీఆర్సీ, పదవీ విరమణ వయస్సు పెంపు, సీపీఎస్ ఉద్యోగుల ఫ్యామిలీ పింఛన్, ఈహెచ్ఎస్ తదితర అంశాలన్నీ ముఖ్యమంత్రి ప్రకటనలో ఉండే అవకాశం ఉంది. ఆర్థికశాఖ కేటాయింపుల్లో రూ.8 వేల కోట్లను ప్రత్యేకంగా పెట్టారు. పీఆర్సీ కోసమే ఈ నిధులను సిద్ధంగా ఉంచారు. ఆంధ్రప్రదేశ్​లో 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చిన నేపథ్యంలో అంతకంటే ఎక్కువే పీఆర్సీ ఉంటుందని ఇటీవల ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం ఉద్యోగసంఘాల నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో 30 శాతానికి అటుఇటుగా వేతన సవరణ ప్రకటించవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి: పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి

Last Updated : Mar 22, 2021, 12:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.