ETV Bharat / state

జూబ్లీహిల్స్ కేసులో నిందితులకు టెస్ట్‌ ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌..!

author img

By

Published : Jun 14, 2022, 8:44 PM IST

jubileehills gang rape case: జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పటి వరకు 17 మంది సాక్షులను గుర్తించారు. ఇవాళ్టితో నిందితుల కస్టడీ ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరిచారు. బాధితురాలిని ముందుగా తీసుకెళ్లిన బెంజ్ కారును మైనర్​ డ్రైవ్ చేసినట్లుగా ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఆ కారు యజమానిపై కేసు నమోదు చేశారు. మరోవైపు అత్యాచారం విషయం తెలిసీ.. పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం నేరంగా పరిగణించిన పోలీసులు.. సాదుద్దీన్‌ సహా ఐదుగురు మైనర్ల తల్లిదండ్రులకు తాఖీదులు పంపారు.

ముగిసిన మైనర్ల కస్టడీ.. నిందితుల తల్లిదండ్రులకు తాఖీదులు
ముగిసిన మైనర్ల కస్టడీ.. నిందితుల తల్లిదండ్రులకు తాఖీదులు

jubileehills gang rape case: జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో మైనర్ బాలుర కస్టడీ ముగిసింది. ఉదయం నుంచి సాయంత్రం 4 వరకు నిందితులను విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపర్చి అక్కడి నుంచి జువైనల్‌ హోంకు తరలించారు. టీఐపీ(టెస్ట్‌ ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌)కు సంబంధించిన పిటిషన్‌పై కోర్టు అనుమతిస్తే.. ఒకటి, రెండు రోజుల్లో కోర్టులో బాలిక నిందితులను గుర్తించే ప్రక్రియను చేపట్టనున్నారు.

ఈ కేసులో ఇప్పటి వరకు 17 మంది సాక్ష్యులను గుర్తించిన పోలీసులు.. ఏడుగురిని విచారించారు. దర్యాప్తు సందర్భంగా పోలీసులు కీలక సమాచారం సేకరించారు. అత్యాచారం అనంతరం నిందితులు.. తాము చేసిన నేరాన్ని కప్పిపుచ్చేందుకు ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నాలు చేశారని పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించారు. వారు బాధితురాలితో పాటు ప్రయాణించిన ఇన్నోవా కారు పోలీసుల దృష్టిలో పడకుండా ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కారు డ్రైవర్‌కు అప్పగించారు. అతడు మొయినాబాద్‌ సమీపంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో కారును నిలిపి వచ్చేశాడు. ఆ వ్యవసాయ క్షేత్రం ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌దేనని నిందితులు పోలీసులకు తెలిపినట్టు సమాచారం.

నిందితుల తల్లిదండ్రులకు తాఖీదులు..: ఇక పోక్సో చట్టం ప్రకారం మైనర్లపై లైంగికదాడులు జరిగినప్పుడు ఆ విషయం తెలిసీ.. పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం నేరంగా పరిగణించిన పోలీసులు.. సాదుద్దీన్‌ సహా ఐదుగురు మైనర్ల తల్లిదండ్రులకు తాఖీదులు పంపారు. బెంజ్‌కారు, ఇన్నోవా కారును మైనర్లు నడిపినట్టు సాక్ష్యాధారాలు లభించడంతో ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులు రెండుకార్ల యజమానులపై కేసులు నమోదు చేశారు.

50 మంది బాలికలను ఆరా..: పబ్‌లో మే 28న జరిగిన పార్టీకి 182 మంది హాజరు కాగా.. ఇందులో 70 మంది బాలికలు, యువతులు వేడుకల్లో పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు. ఇందులో 50 మంది బాలికలు, యువతులతో ఫోన్లో మాట్లాడి పబ్‌లో ఏం జరిగింది..? బాధిత బాలికను ఎవరైనా అల్లరి చేశారా..? ఆమె నృత్యం చేస్తున్నప్పుడు నిందితులు ఆమె వద్దకు వెళ్లారా..? ఇద్దరు బాలికలు మాత్రమే బయటకు వెళ్లారా..? వారితో పాటు ఇంకా ఎవరైనా బయటకు వెళ్లారా? అని ప్రశ్నించారు. అనంతరం అత్యాచార ఘటనకు సంబంధించి పరోక్షంగా, ప్రత్యక్షంగా తెలిసిన 20 మంది సాక్ష్యులను విచారించారు.

అంతా గమనిస్తూనే.. సామూహిక అత్యాచారానికి పాల్పడిన అనంతరం నిందితులు బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు ఏం చేయనున్నారని తొలిరోజు నుంచే గమనిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. జూబ్లీహిల్స్‌ ఠాణాలో బాలిక తండ్రి ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకున్న సాదుద్దీన్, ఐదుగురు మైనర్లు పోలీసులకు చిక్కకుండా తలోదారి పారిపోయారు. ఇదే విషయాన్ని వారు విచారణలో అంగీకరించారు. బంజారాహిల్స్‌లో ఉంటున్న ఒక నిందితుడు తన తల్లి అప్పటికే ఊటీలో ఉండగా.. అక్కడికి వెళ్లాడు. మరొకరు ఏపీలోని నెల్లూరు ప్రాంతంలోని దర్గా ప్రాంతానికి వెళ్లి పోలీసులకు చిక్కాడు. మరో ఇద్దరు మధ్యవర్తుల ఆధారంగా పోలీసుల ముందు లొంగిపోయారు. ఏ-5గా ఉన్న మైనర్​ గుల్బర్గా ప్రాంతంలో చిక్కినట్లు సమాచారం.

అదంతా ఫేక్​.. మరోవైపు అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయొద్దంటూ బాధితురాలి తండ్రికి ఓ ఎమ్మెల్యే ఫోన్‌ చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని పోలీసులు ఖండించారు.

సంబంధిత కథనాలు..

'ఆ సినిమాలు చూసి.. అందరం అనుకునే రేప్​ చేశాం'

పార్టీ నుంచి అరెస్టుల దాకా.. జూబ్లీహిల్స్​ కేసులో మినిట్​ టు మినిట్ అప్డేట్​

'బాలిక వివరాలు నేను చెప్పలేదు.. నాకూ చట్టం తెలుసు'

jubileehills gang rape case: జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో మైనర్ బాలుర కస్టడీ ముగిసింది. ఉదయం నుంచి సాయంత్రం 4 వరకు నిందితులను విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపర్చి అక్కడి నుంచి జువైనల్‌ హోంకు తరలించారు. టీఐపీ(టెస్ట్‌ ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌)కు సంబంధించిన పిటిషన్‌పై కోర్టు అనుమతిస్తే.. ఒకటి, రెండు రోజుల్లో కోర్టులో బాలిక నిందితులను గుర్తించే ప్రక్రియను చేపట్టనున్నారు.

ఈ కేసులో ఇప్పటి వరకు 17 మంది సాక్ష్యులను గుర్తించిన పోలీసులు.. ఏడుగురిని విచారించారు. దర్యాప్తు సందర్భంగా పోలీసులు కీలక సమాచారం సేకరించారు. అత్యాచారం అనంతరం నిందితులు.. తాము చేసిన నేరాన్ని కప్పిపుచ్చేందుకు ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నాలు చేశారని పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించారు. వారు బాధితురాలితో పాటు ప్రయాణించిన ఇన్నోవా కారు పోలీసుల దృష్టిలో పడకుండా ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కారు డ్రైవర్‌కు అప్పగించారు. అతడు మొయినాబాద్‌ సమీపంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో కారును నిలిపి వచ్చేశాడు. ఆ వ్యవసాయ క్షేత్రం ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌దేనని నిందితులు పోలీసులకు తెలిపినట్టు సమాచారం.

నిందితుల తల్లిదండ్రులకు తాఖీదులు..: ఇక పోక్సో చట్టం ప్రకారం మైనర్లపై లైంగికదాడులు జరిగినప్పుడు ఆ విషయం తెలిసీ.. పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం నేరంగా పరిగణించిన పోలీసులు.. సాదుద్దీన్‌ సహా ఐదుగురు మైనర్ల తల్లిదండ్రులకు తాఖీదులు పంపారు. బెంజ్‌కారు, ఇన్నోవా కారును మైనర్లు నడిపినట్టు సాక్ష్యాధారాలు లభించడంతో ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులు రెండుకార్ల యజమానులపై కేసులు నమోదు చేశారు.

50 మంది బాలికలను ఆరా..: పబ్‌లో మే 28న జరిగిన పార్టీకి 182 మంది హాజరు కాగా.. ఇందులో 70 మంది బాలికలు, యువతులు వేడుకల్లో పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు. ఇందులో 50 మంది బాలికలు, యువతులతో ఫోన్లో మాట్లాడి పబ్‌లో ఏం జరిగింది..? బాధిత బాలికను ఎవరైనా అల్లరి చేశారా..? ఆమె నృత్యం చేస్తున్నప్పుడు నిందితులు ఆమె వద్దకు వెళ్లారా..? ఇద్దరు బాలికలు మాత్రమే బయటకు వెళ్లారా..? వారితో పాటు ఇంకా ఎవరైనా బయటకు వెళ్లారా? అని ప్రశ్నించారు. అనంతరం అత్యాచార ఘటనకు సంబంధించి పరోక్షంగా, ప్రత్యక్షంగా తెలిసిన 20 మంది సాక్ష్యులను విచారించారు.

అంతా గమనిస్తూనే.. సామూహిక అత్యాచారానికి పాల్పడిన అనంతరం నిందితులు బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు ఏం చేయనున్నారని తొలిరోజు నుంచే గమనిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. జూబ్లీహిల్స్‌ ఠాణాలో బాలిక తండ్రి ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకున్న సాదుద్దీన్, ఐదుగురు మైనర్లు పోలీసులకు చిక్కకుండా తలోదారి పారిపోయారు. ఇదే విషయాన్ని వారు విచారణలో అంగీకరించారు. బంజారాహిల్స్‌లో ఉంటున్న ఒక నిందితుడు తన తల్లి అప్పటికే ఊటీలో ఉండగా.. అక్కడికి వెళ్లాడు. మరొకరు ఏపీలోని నెల్లూరు ప్రాంతంలోని దర్గా ప్రాంతానికి వెళ్లి పోలీసులకు చిక్కాడు. మరో ఇద్దరు మధ్యవర్తుల ఆధారంగా పోలీసుల ముందు లొంగిపోయారు. ఏ-5గా ఉన్న మైనర్​ గుల్బర్గా ప్రాంతంలో చిక్కినట్లు సమాచారం.

అదంతా ఫేక్​.. మరోవైపు అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయొద్దంటూ బాధితురాలి తండ్రికి ఓ ఎమ్మెల్యే ఫోన్‌ చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని పోలీసులు ఖండించారు.

సంబంధిత కథనాలు..

'ఆ సినిమాలు చూసి.. అందరం అనుకునే రేప్​ చేశాం'

పార్టీ నుంచి అరెస్టుల దాకా.. జూబ్లీహిల్స్​ కేసులో మినిట్​ టు మినిట్ అప్డేట్​

'బాలిక వివరాలు నేను చెప్పలేదు.. నాకూ చట్టం తెలుసు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.