MP Arvind Case: తెరాస ఫ్లెక్సీలు చించారన్న అభియోగంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై బంజారాహిల్స్లో నమోదైన కేసును ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కేబీఆర్ పార్కు వద్ద తెరాస ఫ్లెక్సీలు చింపి... కేసీఆర్, కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అర్వింద్పై అభియోగం. తెరాస నేత తాతా మధు ఫిర్యాదు మేరకు 2020 నవంబరులో కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులు ప్రజా ప్రతినిధుల కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు.
ఈనెల 24న కేసు విచారణకు అర్వింద్ హాజరు కాకపోవడంతో న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఇవాళ అర్వింద్ హాజరు కావడంతో ఎన్బీడబ్ల్యూ రద్దు చేసి విచారణ చేపట్టింది. పోలీసుల అభియోగాలన్నీ తప్పని అర్వింద్ తెలిపారు. అర్వింద్, పోలీసుల తరఫున వాదనలు విన్న ప్రజా ప్రతినిధుల కోర్టు తగిన ఆధారాలు లేవంటూ కేసును కొట్టివేసింది.
ఇదీ చదవండి: