ETV Bharat / state

పీవీ స్మారక తపాలా బిళ్ల విడుదలకు కేంద్రం సుముఖం - తెరాస ఎంపీ నామ నాగేశ్వర్ రావు

సీఎం కేసీఆర్ ప్రతిపాదన మేరకు పీవీ నరసింహారావు స్మారక తపాలా బిళ్ల విడుదలకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. డిసెంబర్​లో హైదరాబాద్​లో రాష్ట్రపతి విడిది సందర్భంగా పీవీ స్మారక తపాలా బిళ్ల విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

the-center-is-willing-to-issue-a-pv-memorial-postage-stamp
పీవీ స్మారక తపాలా బిళ్ల విడుదలకు కేంద్రం సుముఖం
author img

By

Published : Sep 23, 2020, 8:31 PM IST

సీఎం కేసీఆర్ ప్రతిపాదన మేరకు పీవీ నరసింహారావు స్మారక తపాలా బిళ్ల విడుదలకు కేంద్రం సుముఖం వ్యక్తం చేసింది. డిసెంబర్​లో జరిగే పర్యటనలో భాగంగా హైదరాబాద్ ​రాష్ట్రపతి విడిదిలో పీవీ స్మారక తపాలా బిళ్ల విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ లేఖను కేంద్ర న్యాయ & సమాచార శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్​కు ఎంపీ నామ నాగేశ్వర్ రావు అందజేశారు.

ఏడాది పొడువునా 51 దేశాల్లో పీవీ శత జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని ఎంపీ నామ అన్నారు. దేశంలో గొప్ప ఆర్థిక సంస్కరణలకు పితామహుడు పీవీ అని ప్రపంచం మెచ్చుకుందని కొనియాడారు. బహుబాషా కోవిదుడు, దేశంలో అనేక సంస్కరణలకు ఆద్యుడు.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన తెలంగాణ బిడ్డ.. తెలుగు జాతి కీర్తి ప్రతిష్ఠలను నలుమూలలకు పీవీ చాటారని ఎంపీ నామ ప్రశంసించారు.

సీఎం కేసీఆర్ ప్రతిపాదన మేరకు పీవీ నరసింహారావు స్మారక తపాలా బిళ్ల విడుదలకు కేంద్రం సుముఖం వ్యక్తం చేసింది. డిసెంబర్​లో జరిగే పర్యటనలో భాగంగా హైదరాబాద్ ​రాష్ట్రపతి విడిదిలో పీవీ స్మారక తపాలా బిళ్ల విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ లేఖను కేంద్ర న్యాయ & సమాచార శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్​కు ఎంపీ నామ నాగేశ్వర్ రావు అందజేశారు.

ఏడాది పొడువునా 51 దేశాల్లో పీవీ శత జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని ఎంపీ నామ అన్నారు. దేశంలో గొప్ప ఆర్థిక సంస్కరణలకు పితామహుడు పీవీ అని ప్రపంచం మెచ్చుకుందని కొనియాడారు. బహుబాషా కోవిదుడు, దేశంలో అనేక సంస్కరణలకు ఆద్యుడు.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన తెలంగాణ బిడ్డ.. తెలుగు జాతి కీర్తి ప్రతిష్ఠలను నలుమూలలకు పీవీ చాటారని ఎంపీ నామ ప్రశంసించారు.

ఇదీ చూడండి : రాజ్ భవన్ మహిళలకు చేతి వృత్తుల్లో శిక్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.