ETV Bharat / state

Kodandaram on TRS: 'ప్రభుత్వమే భూ కబ్దాదారు అవతారమెత్తింది'

author img

By

Published : Dec 10, 2021, 5:59 PM IST

Kodandaram on TRS: హైదరాబాద్​ ఇందిరా పార్కు ధర్నాఛౌక్‌లో భూ నిర్వాసితుల దీక్ష జరిగింది. రైతుల నుంచి బలవంతపు భూ సేకరణ ఆపాలని డిమాండ్​ చేస్తూ తెలంగాణ భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. దీక్షకు హాజరైన తెజస అధ్యక్షుడు కోదండరాం.. నిజాంల పాలనను గుర్తుకు తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

Kodandaram on TRS
కోదండ రాం

Kodandaram on TRS: రాష్ట్రంలో భూసేకరణపై ప్రభుత్వం అత్యంత దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. నిజాం కాలంనాటి రోజులను గుర్తుచేసేలా భూములు సేకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో భూ నిర్వాసితుల దీక్షకు కోదండరాం మద్దతు తెలిపారు. సర్కారు బలవంతపు భూసేకరణ ఆపాలని కోదండరాం డిమాండ్‌ చేశారు.

'ప్రభుత్వమే భూ కబ్జాదారు'

'అసైన్డ్​ భూముల విషయంలో అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడి.. అక్రమంగా లాక్కుంటున్నారు. చిన్న చిన్న లీగల్​ సమస్యలను అడ్డం పెట్టుకుని.. అంతో ఇంతో ఇచ్చి భూమిని గుంజుకుంటున్నారు. ప్రభుత్వమే భూ కబ్జాదారుగా అవతారమెత్తింది.

-కోదండ రాం, తెజస అధ్యక్షుడు

ఆ హక్కు ఉండాలి

ఈ పరిస్థితుల్లో ప్రజలు తమ హక్కులను కాపాడుకోవడం చాలా అవసరమని కోదండరాం అభిప్రాయపడ్డారు. రైతులకు భూయాజమాన్య హక్కు ఉండాలని చెప్పారు. ప్రజావసరాల కోసం యజామానుల నుంచి భూములు తీసుకుంటే.. 2013 చట్టం ప్రకారం భూనిర్వాసితులకు ప్రభుత్వమే న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

బలవంతపు భూ సేకరణ ఆపాలి

ఇదీ చదవండి: KTR Pressmeet: 'కేంద్రానికి ఇక విజ్ఞప్తులు చేయం.. ప్రజల పక్షాన డిమాండ్ చేస్తాం'

Kodandaram on TRS: రాష్ట్రంలో భూసేకరణపై ప్రభుత్వం అత్యంత దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. నిజాం కాలంనాటి రోజులను గుర్తుచేసేలా భూములు సేకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో భూ నిర్వాసితుల దీక్షకు కోదండరాం మద్దతు తెలిపారు. సర్కారు బలవంతపు భూసేకరణ ఆపాలని కోదండరాం డిమాండ్‌ చేశారు.

'ప్రభుత్వమే భూ కబ్జాదారు'

'అసైన్డ్​ భూముల విషయంలో అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడి.. అక్రమంగా లాక్కుంటున్నారు. చిన్న చిన్న లీగల్​ సమస్యలను అడ్డం పెట్టుకుని.. అంతో ఇంతో ఇచ్చి భూమిని గుంజుకుంటున్నారు. ప్రభుత్వమే భూ కబ్జాదారుగా అవతారమెత్తింది.

-కోదండ రాం, తెజస అధ్యక్షుడు

ఆ హక్కు ఉండాలి

ఈ పరిస్థితుల్లో ప్రజలు తమ హక్కులను కాపాడుకోవడం చాలా అవసరమని కోదండరాం అభిప్రాయపడ్డారు. రైతులకు భూయాజమాన్య హక్కు ఉండాలని చెప్పారు. ప్రజావసరాల కోసం యజామానుల నుంచి భూములు తీసుకుంటే.. 2013 చట్టం ప్రకారం భూనిర్వాసితులకు ప్రభుత్వమే న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

బలవంతపు భూ సేకరణ ఆపాలి

ఇదీ చదవండి: KTR Pressmeet: 'కేంద్రానికి ఇక విజ్ఞప్తులు చేయం.. ప్రజల పక్షాన డిమాండ్ చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.