తెలుగోత్సవం ఎలా పుట్టింది..?
హైదరాబాద్ పుడ్డీ క్లబ్ సంస్థ అధిపతి సంకల్ప్, స్సైసీ వెన్యూ సంస్థ అధిపతి శ్రీనివాస్ సంపత్లు స్నేహితులు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడేందుకు ఏదైనా చేయాలనకున్నారు. అందులో భాగంగానే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన గొప్పతనాన్ని అందిరికీ తెలియజెప్పేందుకు తెలుగోత్సవం పేరిట ఓ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తిచేసుకుని మూడో సంవత్సరంలోకి తెలుగోత్సవం అడుగుపెట్టింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంతో వచ్చిన డబ్బును రైస్ బకెట్ ఛాలెంజ్ నిర్వహించే స్వచ్చంద సంస్థ నిర్వాహకురాలు మంజులతకు అందజేస్తారు. ఆమె ఆ బియ్యాన్ని అనాథలకు చేరుస్తుంది.
ఈ ఏడాది తెలుగోత్సవ కార్యక్రమంలో...
ఈ సంవత్సరం తెలుగోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సుమారు 300 మంది హాజరయ్యారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నోరూరించే వెజ్, నాన్వెజ్ వంటకాలు, స్వీట్లు, తియ్యటి పానీయాలు అందరిని ఆకట్టుకున్నాయి. కేవలం పల్లెల్లో కనిపించే మట్టి పాత్రల తయారీని చూసి పరవశించిపోయారు పిల్లలు. మహిళలకు అత్యంత ఇష్టమైన గోరింటాకుతో చేతులను అలంకరించుకున్నారు. అంతేకాకుండా చిలకజోస్యం చెప్పించుకుంటూ ఆనందపడ్డారు. గాజుల తయారీని చూసి మైమరిచిపోయారు.
తెలుగోత్సవ కార్యక్రమం ఉగాది పర్వదిన విశిష్టతను అందరికీ తెలియజేస్తుంది. ఇలాంటి కార్యక్రమంతో మన దేశ సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందిస్తున్న ఈ ఇద్దరు స్నేహితుల కృషిని అందరూ అభినందిస్తున్నారు.
ఇవీ చదవండి:'నిజామాబాద్ ఎన్నిక వాయిదా వేయాలని విజ్ఞప్తి'