కోవిడ్-19కు వ్యతిరేకంగా కేరళ పాటించిన పద్ధతులను అధ్యయనం చేసేందుకు తెలంగాణ వైద్య బృందం కేరళలో పర్యటించింది. కరోనాను ఎదుర్కునేందుకు కేరళ అనుసరించిన పద్ధతులు, నివారణకు తీసుకున్న చర్యలపై కేరళ ఆరోగ్య మంత్రి కే.కే.శైలజతో వైద్య బృందం సమీక్షించింది.
తెలంగాణలోనూ అనుసరిస్తాం..
కేరళలో మోడల్ ప్రక్రియను రాష్ట్రంలోనూ అనుసరించనున్నట్లు వైద్య బృందం తెలిపింది. వైరస్కు వ్యతిరేకంగా సమర్ధవంతమైన కార్యాచరణ ప్రణాళికను కేరళ అనుసరించడంపట్ల డబ్ల్యూహెచ్ఓ, ఐక్యరాజ్యసమితి హర్షం వ్యక్తం చేసిందని అక్కడి అధికారులు వివరించారు.
ఇదీ చదవండి: ట్రాఫిక్ ఉల్లంఘనలతో బస్సు యజమానికి రూ.6.7 లక్షల ఫైన్