ETV Bharat / state

నకిలీ విత్తనాల పని పట్టేందుకు సిద్ధమైన పోలీసులు - నకిలీ విత్తనాల పని పట్టేందుకు సిద్ధమైన పోలీసులు

నకిలీ విత్తనాలతో రైతులను బురిడీ కొట్టిస్తున్న అక్రమార్కులపై రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణవ్యాప్తంగా నకిలీ దందా మూలాన్ని కనిపెట్టేందుకు యత్నిస్తున్నారు. ఇందుకోసం ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో గతంలోనే ఏర్పాటైన టాస్క్​ ఫోర్స్​ ఈ దిశగా కసరత్తు చేస్తోంది. వీటి తయారీదారులపై కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టేందుకు నిర్ణయించారు.

telangana police on fake seeds eradication
నకిలీ విత్తనాల పని పట్టేందుకు సిద్ధమైన పోలీసులు
author img

By

Published : May 30, 2020, 2:55 PM IST

ఏటా విత్తనాల సీజన్​లో నకిలీ విత్తనాల తయారీదారులపై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ వరుస దాడులు నిర్వహిస్తోంది. వీటితో పాటు వ్యవసాయ అధికారుల సహాయంతో నకిలీ విత్తనాలను గుర్తిస్తూ పోలీసులు నిందితులపై పీడీయాక్ట్​ ప్రయోగిస్తోంది. 2014 నుంచి ఈ కేసుల్లో 13 మందిపై పీడీ యాక్ట్​ ప్రయోగించారు. త్వరలో ఖరీఫ్​ రానుండగా.. నకిలీ దందాపై ప్రత్యేక దృష్టి సారించారు.

మరింత కఠినంగా..

ఈ ఏడాది ఇప్పటివరకూ 7 ఘటనల్లో 65 మందిపై కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ సారి మరింత కఠినంగా వ్యవహరించే అవకాశముంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కుమురంభీం ఆసిఫాబాద్, నల్గొండ, రామగుండం కమిషనరేట్​లలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

కమిషనరేట్​లుకేసులు
కుమురంభీం ఆసిఫాబాద్ 75
నల్గొండ 59
రామగుండం 72

గతేడాది 149 కేసుల్లో 293 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఈ ఏడాది ఇప్పటివరకు ఏడు కేసుల్లో 65 కేసులు నమోదు చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు 381 కేసులకు గానూ 768 మందిని అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి: 'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'

ఏటా విత్తనాల సీజన్​లో నకిలీ విత్తనాల తయారీదారులపై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ వరుస దాడులు నిర్వహిస్తోంది. వీటితో పాటు వ్యవసాయ అధికారుల సహాయంతో నకిలీ విత్తనాలను గుర్తిస్తూ పోలీసులు నిందితులపై పీడీయాక్ట్​ ప్రయోగిస్తోంది. 2014 నుంచి ఈ కేసుల్లో 13 మందిపై పీడీ యాక్ట్​ ప్రయోగించారు. త్వరలో ఖరీఫ్​ రానుండగా.. నకిలీ దందాపై ప్రత్యేక దృష్టి సారించారు.

మరింత కఠినంగా..

ఈ ఏడాది ఇప్పటివరకూ 7 ఘటనల్లో 65 మందిపై కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ సారి మరింత కఠినంగా వ్యవహరించే అవకాశముంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కుమురంభీం ఆసిఫాబాద్, నల్గొండ, రామగుండం కమిషనరేట్​లలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

కమిషనరేట్​లుకేసులు
కుమురంభీం ఆసిఫాబాద్ 75
నల్గొండ 59
రామగుండం 72

గతేడాది 149 కేసుల్లో 293 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఈ ఏడాది ఇప్పటివరకు ఏడు కేసుల్లో 65 కేసులు నమోదు చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు 381 కేసులకు గానూ 768 మందిని అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి: 'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.