ETV Bharat / state

గాంధీలో కోలుకున్న కరోనా బాధితుడు..!

author img

By

Published : Mar 9, 2020, 11:00 PM IST

Updated : Mar 9, 2020, 11:16 PM IST

రాష్ట్రంలో తొలి కరోనా బాధితుడు కోలుకుంటున్నట్లు సమాచారం. గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చికిత్సపొందుతున్న బాధితుడి నమూనా రిపోర్టులో నెగిటివ్‌ వచ్చింది. యువకుడికి క్రమంగా జ్వరం తగ్గి, బీపీ అదుపులోకి వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు.

corona virus
corona virus

రాష్ట్రంలో తొలి కరోనా బాధితుడిగా నమోదై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి కోలుకుంటున్నట్లు తెలిసింది. ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో యువకుడు చికిత్స పొందుతున్నాడు. ఐసీయూలో ఉంచి వైద్య పరీక్షలు అందించారు. ప్రస్తుతం 32 మంది ఇన్​పేషెంట్లుగా ఉన్నారని, వారిలో నెగిటివ్ రిపోర్టులు వచ్చిన వారందరినీ పంపిస్తున్నట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి.

కరోనా అనుమానితుడి నుంచి తాజాగా నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించగా నెగిటివ్ వచ్చినట్లు వెల్లడైంది. వైద్యబృందం ప్రత్యేక చొరవ తీసుకుని వైద్యం అందించడంతో క్రమంగా జ్వరం తగ్గి, బీపీ అదుపులోకి వచ్చింది.

తాజాగా ఊపిరితిత్తులకు సంబంధించిన నమూనాలు మళ్లీ సేకరించి పరీక్షలు పంపించడంతో నెగిటివ్ రిపోర్టు వచ్చింది. దీనిపై ఆసుపత్రివర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోసారి నమూనాలను సేకరించి పుణే వైరాలజీ ల్యాబ్​కు పంపించాలని నిర్ణయించారు. అక్కడ కూడా నెగిటివ్ వస్తే.. అతడిని డిశ్చార్జ్ చేస్తారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలోకి కరోనా రానివ్వం: కేసీఆర్​

రాష్ట్రంలో తొలి కరోనా బాధితుడిగా నమోదై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి కోలుకుంటున్నట్లు తెలిసింది. ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో యువకుడు చికిత్స పొందుతున్నాడు. ఐసీయూలో ఉంచి వైద్య పరీక్షలు అందించారు. ప్రస్తుతం 32 మంది ఇన్​పేషెంట్లుగా ఉన్నారని, వారిలో నెగిటివ్ రిపోర్టులు వచ్చిన వారందరినీ పంపిస్తున్నట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి.

కరోనా అనుమానితుడి నుంచి తాజాగా నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించగా నెగిటివ్ వచ్చినట్లు వెల్లడైంది. వైద్యబృందం ప్రత్యేక చొరవ తీసుకుని వైద్యం అందించడంతో క్రమంగా జ్వరం తగ్గి, బీపీ అదుపులోకి వచ్చింది.

తాజాగా ఊపిరితిత్తులకు సంబంధించిన నమూనాలు మళ్లీ సేకరించి పరీక్షలు పంపించడంతో నెగిటివ్ రిపోర్టు వచ్చింది. దీనిపై ఆసుపత్రివర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోసారి నమూనాలను సేకరించి పుణే వైరాలజీ ల్యాబ్​కు పంపించాలని నిర్ణయించారు. అక్కడ కూడా నెగిటివ్ వస్తే.. అతడిని డిశ్చార్జ్ చేస్తారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలోకి కరోనా రానివ్వం: కేసీఆర్​

Last Updated : Mar 9, 2020, 11:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.