ETV Bharat / state

శాసనసభ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు తెర - ఓట్ల లెక్కింపునకు కౌంట్​ డౌన్ స్టార్ట్

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 2, 2023, 10:29 PM IST

Telangana Election Counting Arrangements 2023 : శాసనసభ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్లతో లెక్కింపు ప్రారంభంకానుండగా, అరగంట తర్వాత ఈవీఎమ్​లలోని ఓట్లను లెక్కిస్తారు. అన్నిచోట్ల 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సమయంలో ‌అనుమతి పొందిన వారికే ప్రవేశముంటుందని, పరిసరాలన్నీ మూడంచెల భద్రతతో కట్టుదిట్టంగా ఉంటాయని అధికారులు తెలిపారు.

Telangana Assembly Elections 2023
Telangana Election Counting Arrangements 2023
శాసనసభ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు తెర - ఓట్ల లెక్కింపునకు కౌంట్​ డౌన్ స్టార్ట్

Telangana Election Counting Arrangements 2023 : శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన వారి భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఈవీఎంలలో(EVM) నిక్షిప్తం చేసిన రెండు కోట్లా 32 లక్షలకు పైగా ఓటర్ల తీర్పు మరికొంత సమయంలో వెలువడనుంది. 2290 మంది అభ్యర్థుల గెలుపోటములు వెల్లడి కానున్నాయి. 119 నియోజకవర్గాలకు గత నెల 30వ తేదీన జరిగిన పోలింగ్​కు సంబంధించి మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ షూరూ - 10గంటలకు తొలి ఫలితం

ఉదయం ఎనిమిది గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపడతారు. అరగంట తర్వాత ఎనిమిదిన్నరకు ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 2417 రౌండ్లలో ఫలితాలు(Election Result) తేలనున్నాయి. అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 26 రౌండ్లలో లెక్కింపు చేపట్టనుండగా, అత్యల్పంగా భద్రాచలంలో కేవలం 13 రౌండ్లలో లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కోసం 119 నియోజకవర్గాల్లో 1798 టేబుళ్లు ఏర్పాటు చేశారు. గరిష్టంగా మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో లెక్కింపు కోసం 28 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు.

Telangana Elections Counting Centers : పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే, ఈవీఎంలోని ఓట్లతో పాటు సమాంతరంగా లెక్కిస్తారు. చివరి రౌండ్ మాత్రం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైతేనే చేపడతారు. మొత్తం లెక్కింపు పూర్తయ్యాక ఐదు వీవీప్యాట్ యంత్రాల్లోని(VVPAT Machine) స్లిప్పులను ర్యాండమ్​గా లెక్కిస్తారు. ఆ తర్వాతే ఫలితాన్ని ప్రకటిస్తారు. మొత్తంగా రాష్ట్రంలో 71.34 ఓటింగ్ శాతం నమోదైంది. నియోజకవర్గాల వారీగా చూస్తే అత్యధికంగా మునుగోడులో 91.89 శాతం పోలింగ్ జరిగింది. అత్యల్పంగా యాకుత్ పురాలో కేవలం 39.64 శాతం ఓటర్లు మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు.

రేపు ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం

Telangana Assembly Elections 2023 : ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 2290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 2068 మంది పురుషులు, 221 మంది మహిళలు కాగా ఒకరు ట్రాన్స్​జెండర్ ఉన్నారు. బీఆర్​ఎస్ మొత్తం 119 స్థానాల్లో పోటీలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థులు 118 చోట్ల బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు 111 స్థానాల్లో పోటీలో నిలవగా, మిత్రపక్షం జనసేన(Janasena Party) ఎనిమిది స్థానాల్లో పోటీ చేసింది. సీపీఎం 19, సీపీఐ ఒక స్థానంలో, బీఎస్పీ నుంచి 108 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.

ఇతర పార్టీలు, స్వతంత్రులు ఈ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పోటీలో నిలిచారు. అత్యధికంగా ఎల్బీనగర్​లో 48 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, అత్యల్పంగా నారాయణపేట, బాన్స్ వాడలో కేవలం ఏడుగురు అభ్యర్థులు మాత్రమే ఎన్నికల బరిలో నిలిచారు. ఉదయం 10 గంటల తర్వాత తొలిఫలితం వెలవడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఓట్ల లెక్కింపుపై పోలీసులకు డీజీపీ కీలక సూచనలు - ఆ విషయంలో అలెర్ట్​గా ఉండాలంటూ ఆదేశాలు

ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రంలోకి ఎప్పుడైనా వెళ్లారా? లోపల ఏం జరుగుతుందో తెలుసా?

శాసనసభ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు తెర - ఓట్ల లెక్కింపునకు కౌంట్​ డౌన్ స్టార్ట్

Telangana Election Counting Arrangements 2023 : శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన వారి భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఈవీఎంలలో(EVM) నిక్షిప్తం చేసిన రెండు కోట్లా 32 లక్షలకు పైగా ఓటర్ల తీర్పు మరికొంత సమయంలో వెలువడనుంది. 2290 మంది అభ్యర్థుల గెలుపోటములు వెల్లడి కానున్నాయి. 119 నియోజకవర్గాలకు గత నెల 30వ తేదీన జరిగిన పోలింగ్​కు సంబంధించి మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ షూరూ - 10గంటలకు తొలి ఫలితం

ఉదయం ఎనిమిది గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపడతారు. అరగంట తర్వాత ఎనిమిదిన్నరకు ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 2417 రౌండ్లలో ఫలితాలు(Election Result) తేలనున్నాయి. అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 26 రౌండ్లలో లెక్కింపు చేపట్టనుండగా, అత్యల్పంగా భద్రాచలంలో కేవలం 13 రౌండ్లలో లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కోసం 119 నియోజకవర్గాల్లో 1798 టేబుళ్లు ఏర్పాటు చేశారు. గరిష్టంగా మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో లెక్కింపు కోసం 28 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు.

Telangana Elections Counting Centers : పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే, ఈవీఎంలోని ఓట్లతో పాటు సమాంతరంగా లెక్కిస్తారు. చివరి రౌండ్ మాత్రం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైతేనే చేపడతారు. మొత్తం లెక్కింపు పూర్తయ్యాక ఐదు వీవీప్యాట్ యంత్రాల్లోని(VVPAT Machine) స్లిప్పులను ర్యాండమ్​గా లెక్కిస్తారు. ఆ తర్వాతే ఫలితాన్ని ప్రకటిస్తారు. మొత్తంగా రాష్ట్రంలో 71.34 ఓటింగ్ శాతం నమోదైంది. నియోజకవర్గాల వారీగా చూస్తే అత్యధికంగా మునుగోడులో 91.89 శాతం పోలింగ్ జరిగింది. అత్యల్పంగా యాకుత్ పురాలో కేవలం 39.64 శాతం ఓటర్లు మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు.

రేపు ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం

Telangana Assembly Elections 2023 : ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 2290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 2068 మంది పురుషులు, 221 మంది మహిళలు కాగా ఒకరు ట్రాన్స్​జెండర్ ఉన్నారు. బీఆర్​ఎస్ మొత్తం 119 స్థానాల్లో పోటీలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థులు 118 చోట్ల బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు 111 స్థానాల్లో పోటీలో నిలవగా, మిత్రపక్షం జనసేన(Janasena Party) ఎనిమిది స్థానాల్లో పోటీ చేసింది. సీపీఎం 19, సీపీఐ ఒక స్థానంలో, బీఎస్పీ నుంచి 108 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.

ఇతర పార్టీలు, స్వతంత్రులు ఈ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పోటీలో నిలిచారు. అత్యధికంగా ఎల్బీనగర్​లో 48 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, అత్యల్పంగా నారాయణపేట, బాన్స్ వాడలో కేవలం ఏడుగురు అభ్యర్థులు మాత్రమే ఎన్నికల బరిలో నిలిచారు. ఉదయం 10 గంటల తర్వాత తొలిఫలితం వెలవడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఓట్ల లెక్కింపుపై పోలీసులకు డీజీపీ కీలక సూచనలు - ఆ విషయంలో అలెర్ట్​గా ఉండాలంటూ ఆదేశాలు

ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రంలోకి ఎప్పుడైనా వెళ్లారా? లోపల ఏం జరుగుతుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.