ETV Bharat / state

రాయలసీమ ఎత్తిపోతలతో నదినే మళ్లించే ప్రయత్నం: తెలంగాణ

author img

By

Published : Aug 29, 2020, 5:36 AM IST

Updated : Aug 29, 2020, 7:04 AM IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకంతో నది మొత్తాన్నే మళ్లించే యత్నం చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)లో వాదించింది. ‘రోజుకు 80 వేల క్యూసెక్కుల నీటి మళ్లింపు అంటే సుమారు 8 టీఎంసీల నీరు. ఆ మొత్తం నీటితో దేశం మొత్తానికి తాగు నీరు సరఫరా చేయొచ్చు’ అని వివరించింది.

Telangana arguing in NGT over Rayalaseema allegations
రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో వాదించిన తెలంగాణ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకంతో నది మొత్తాన్నే మళ్లించే యత్నం చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)లో వాదించింది. ‘రోజుకు 80 వేల క్యూసెక్కుల నీటి మళ్లింపు అంటే సుమారు 8 టీఎంసీల నీరు. ఆ మొత్తం నీటితో దేశం మొత్తానికి తాగు నీరు సరఫరా చేయొచ్చు’ అని వివరించింది. ఈ పథకానికి పర్యావరణ అనుమతులపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక పూర్తి అసంబద్ధంగా ఉందని స్పష్టం చేసింది.

పర్యావరణ అనుమతులు అవసరం లేదని

పర్యావరణ అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల చేపడుతోందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ అంశంపై ఎన్జీటీ నియమించిన నిపుణుల కమిటీ రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని నివేదిక ఇచ్చింది. దానిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. జస్టిస్‌ రామకృష్ణన్‌, విషయ నిపుణుడు సైబల్‌ దాస్‌ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈ అంశంపై విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచందర్‌రావు, సీనియర్‌ న్యాయవాది సంజీవ్‌ కుమార్‌లు సుమారు రెండు గంటలపాటు తమ వాదనలు వినిపించారు.


మరో వైపు కొత్త ఆయకట్టు

‘‘ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల సామర్థ్యాన్ని భారీగా పెంచింది. మరో వైపు కొత్త ఆయకట్టు లేదని, తాగు నీటి ప్రాజెక్టు అని అంటోంది. వాస్తవానికి అదనంగా పది లక్షల ఎకరాల ఆయకట్టును పెంచి నీరు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కృష్ణా నది జలాలను కృష్ణా బేసిన్‌ అవసరాలకు వినియోగించాలి. ఇక్కడ మాత్రం పెన్నా బేసిన్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ధర్మాసనం అనుమతిస్తే అక్కడి వాస్తవ పరిస్థితులను హెలికాప్టర్‌లో తీసుకెళ్లి చూపుతాం’’ అని తెలిపారు.

తమ వాదన వినలేదని

పర్యావరణ అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల చేపడుతుందనే అంశంపై ఎన్జీటీ నియమించిన నిపుణుల కమిటీ తమ వాదన వినలేదని తెలంగాణ ప్రభుత్వం ధర్మాసనానికి తెలియజేసింది. ‘‘కమిటీలోని ఒకరు ఆంధ్రప్రదేశ్‌ ఇచ్చిన సమాచారం తప్పుదోవ పట్టించేదిగా ఉందని వ్యాఖ్యానించారు. రాయలసీమ ఎత్తిపోతల.. విస్తరణ కిందకు వస్తుందని మరో నిపుణుడు అభిప్రాయపడ్డారు. వారిద్దరి అభిప్రాయాలను పట్టించుకోలేదు. మరో సభ్యుడు నివేదికపై సంతకం పెట్టలేదు. ఈ నేపథ్యంలో కమిటీ ఇచ్చిన నివేదిక ఏకపక్షంగా, పూర్తి అసంబద్ధంగా ఉంది. ఏపీ చెప్పిన దానినే పరిగణనలోకి తీసుకున్నారు. భారీ స్థాయిలో నీటి మళ్లింపునకు సంబంధించిన ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదనడం సరికాదు’’ అని వివరించింది.

నిపుణుల కమిటీ, కేంద్ర పర్యావరణ శాఖ- ఈ రెండింటి తరఫున కేంద్ర పర్యావరణ శాఖ డైరెక్టర్‌ కెరకెట్టా ఒకరే నివేదిక ఇవ్వడంపై పిటిషనర్‌ తరపు న్యాయవాది శ్రావణ్‌ కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనలు విన్న ధర్మాసనం కేసు తదుపరి విచారణను సెప్టెంబరు 3వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చూడండి : 'ప్రైవేటు పాఠశాలల్లో రుసుములను గాడిన పెడతాం'

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకంతో నది మొత్తాన్నే మళ్లించే యత్నం చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)లో వాదించింది. ‘రోజుకు 80 వేల క్యూసెక్కుల నీటి మళ్లింపు అంటే సుమారు 8 టీఎంసీల నీరు. ఆ మొత్తం నీటితో దేశం మొత్తానికి తాగు నీరు సరఫరా చేయొచ్చు’ అని వివరించింది. ఈ పథకానికి పర్యావరణ అనుమతులపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక పూర్తి అసంబద్ధంగా ఉందని స్పష్టం చేసింది.

పర్యావరణ అనుమతులు అవసరం లేదని

పర్యావరణ అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల చేపడుతోందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ అంశంపై ఎన్జీటీ నియమించిన నిపుణుల కమిటీ రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని నివేదిక ఇచ్చింది. దానిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. జస్టిస్‌ రామకృష్ణన్‌, విషయ నిపుణుడు సైబల్‌ దాస్‌ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈ అంశంపై విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచందర్‌రావు, సీనియర్‌ న్యాయవాది సంజీవ్‌ కుమార్‌లు సుమారు రెండు గంటలపాటు తమ వాదనలు వినిపించారు.


మరో వైపు కొత్త ఆయకట్టు

‘‘ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల సామర్థ్యాన్ని భారీగా పెంచింది. మరో వైపు కొత్త ఆయకట్టు లేదని, తాగు నీటి ప్రాజెక్టు అని అంటోంది. వాస్తవానికి అదనంగా పది లక్షల ఎకరాల ఆయకట్టును పెంచి నీరు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కృష్ణా నది జలాలను కృష్ణా బేసిన్‌ అవసరాలకు వినియోగించాలి. ఇక్కడ మాత్రం పెన్నా బేసిన్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ధర్మాసనం అనుమతిస్తే అక్కడి వాస్తవ పరిస్థితులను హెలికాప్టర్‌లో తీసుకెళ్లి చూపుతాం’’ అని తెలిపారు.

తమ వాదన వినలేదని

పర్యావరణ అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల చేపడుతుందనే అంశంపై ఎన్జీటీ నియమించిన నిపుణుల కమిటీ తమ వాదన వినలేదని తెలంగాణ ప్రభుత్వం ధర్మాసనానికి తెలియజేసింది. ‘‘కమిటీలోని ఒకరు ఆంధ్రప్రదేశ్‌ ఇచ్చిన సమాచారం తప్పుదోవ పట్టించేదిగా ఉందని వ్యాఖ్యానించారు. రాయలసీమ ఎత్తిపోతల.. విస్తరణ కిందకు వస్తుందని మరో నిపుణుడు అభిప్రాయపడ్డారు. వారిద్దరి అభిప్రాయాలను పట్టించుకోలేదు. మరో సభ్యుడు నివేదికపై సంతకం పెట్టలేదు. ఈ నేపథ్యంలో కమిటీ ఇచ్చిన నివేదిక ఏకపక్షంగా, పూర్తి అసంబద్ధంగా ఉంది. ఏపీ చెప్పిన దానినే పరిగణనలోకి తీసుకున్నారు. భారీ స్థాయిలో నీటి మళ్లింపునకు సంబంధించిన ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదనడం సరికాదు’’ అని వివరించింది.

నిపుణుల కమిటీ, కేంద్ర పర్యావరణ శాఖ- ఈ రెండింటి తరఫున కేంద్ర పర్యావరణ శాఖ డైరెక్టర్‌ కెరకెట్టా ఒకరే నివేదిక ఇవ్వడంపై పిటిషనర్‌ తరపు న్యాయవాది శ్రావణ్‌ కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనలు విన్న ధర్మాసనం కేసు తదుపరి విచారణను సెప్టెంబరు 3వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చూడండి : 'ప్రైవేటు పాఠశాలల్లో రుసుములను గాడిన పెడతాం'

Last Updated : Aug 29, 2020, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.