ETV Bharat / state

త్వరలో ప్రకటిస్తాం: రావుల

ఎన్టీఆర్​ భవన్​లో నేడు తెదేపా పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. తెదేపా పోటీ చేయనున్న లోక్​సభ స్థానాల వివరాలను రెండు, మూడు రోజుల్లో వెల్లడిస్తామని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు రావుల వెల్లడించారు.

author img

By

Published : Mar 17, 2019, 6:10 AM IST

Updated : Mar 17, 2019, 8:02 AM IST

ఎన్టీఆర్​ భవన్​లో తెదేపా పార్లమెంటరీ కమిటీ భేటీ
ఎన్టీఆర్​ భవన్​లో తెదేపా పార్లమెంటరీ కమిటీ భేటీ
రాష్ట్రంలో తెదేపా పోటీ చేయనున్న ఎంపీ స్థానాలపై రెండు, మూడు రోజుల్లో వివరాలను వెల్లడించనున్నట్లు పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ భవన్​లో శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ఆధ్వర్యంలో పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో మచ్చా నాగేశ్వర రావు సహా గరికపాటి, రావుల, కొత్తకోట దయాకర్​రావుపాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐతో కలిసి పోటీ చేస్తే బాగుంటుందన్న ఆలోచనలపై చర్చలు జరిగాయని రావుల స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికపై తమ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణ నాయకత్వానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని రావుల పేర్కొన్నారు.

ఎన్టీఆర్​ భవన్​లో తెదేపా పార్లమెంటరీ కమిటీ భేటీ
రాష్ట్రంలో తెదేపా పోటీ చేయనున్న ఎంపీ స్థానాలపై రెండు, మూడు రోజుల్లో వివరాలను వెల్లడించనున్నట్లు పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ భవన్​లో శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ఆధ్వర్యంలో పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో మచ్చా నాగేశ్వర రావు సహా గరికపాటి, రావుల, కొత్తకోట దయాకర్​రావుపాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐతో కలిసి పోటీ చేస్తే బాగుంటుందన్న ఆలోచనలపై చర్చలు జరిగాయని రావుల స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికపై తమ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణ నాయకత్వానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని రావుల పేర్కొన్నారు.
Last Updated : Mar 17, 2019, 8:02 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.