ETV Bharat / state

వాణిజ్య పన్నుల శాఖలో లక్ష్యం చేరిన ఉత్సాహం

లక్ష్యానికి మించి పన్నులు వసూలు కావడంపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులను, సిబ్బందిని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్​కుమార్ అభినందించారు. ఈ ఆర్థిక ఏడాదిలో రూ.45 వేల కోట్ల మేర పన్నులు రావడంపై రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు.

author img

By

Published : Apr 3, 2019, 11:19 AM IST

అభినందనలు తెలిపిన ముఖ్యకార్యదర్శి
అభినందనలు తెలిపిన ముఖ్యకార్యదర్శి
హైదరాబాద్​ నాంపల్లిలోని అబ్కారీ భవన్‌లో అధికారులు, సిబ్బందితో వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్​కుమార్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్‌ బకాయిలు, ఎగవేతదారులు, కోర్టు వివాద కేసులు ఇలా వివిధ రకాల పన్నులను వసూలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెలలో రూ.4600 కోట్లు, మార్చిలో రూ.5000 కోట్లు వసూలు అయ్యాయని తెలిపారు. ఇన్ని రోజులు కష్టపడిన అధికారులు, సిబ్బంది ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని సోమేశ్‌కుమార్‌ సూచించారు.

ఇవీ చూడండి:రామన్నగూడెం @ 95%.. అందరూ గిరిజనులే... !

అభినందనలు తెలిపిన ముఖ్యకార్యదర్శి
హైదరాబాద్​ నాంపల్లిలోని అబ్కారీ భవన్‌లో అధికారులు, సిబ్బందితో వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్​కుమార్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్‌ బకాయిలు, ఎగవేతదారులు, కోర్టు వివాద కేసులు ఇలా వివిధ రకాల పన్నులను వసూలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెలలో రూ.4600 కోట్లు, మార్చిలో రూ.5000 కోట్లు వసూలు అయ్యాయని తెలిపారు. ఇన్ని రోజులు కష్టపడిన అధికారులు, సిబ్బంది ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని సోమేశ్‌కుమార్‌ సూచించారు.

ఇవీ చూడండి:రామన్నగూడెం @ 95%.. అందరూ గిరిజనులే... !

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.