గడచిన నాలుగేళ్లుగా గొర్రెల పెంపకందార్లకు రికార్డు స్థాయిలో మేలు జరిగిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వ్యవసాయం తర్వాత పశువుల పెంపకానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. వచ్చే నెల చివర్లో రెండో విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుడతామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో విజయ డెయిరీని పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో విజయ నెయ్యి వాడేలా త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవీ చూడండి: అస్థానా కేసు విచారణ గడువు పెంపు