ETV Bharat / state

నా కుమారుడిని ఆశీర్వదించండి: మంత్రి తలసాని

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సికింద్రాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగుతున్నారు. ప్రచారంలో భాగంగా ఫిల్మ్​నగర్​లోని ఎఫ్ఎన్​సీసీ క్లబ్​లో సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఆశీస్సులు కావాలని కోరగా.. తమవంతు సహకారం అందిస్తామని  హామీ ఇచ్చారు.

author img

By

Published : Apr 4, 2019, 1:49 PM IST

Updated : Apr 4, 2019, 1:56 PM IST

తెలుగు సినీ ప్రముఖులతో సమావేశమైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

తనలాగే తన కుమారుడు సాయికిరణ్​ను ఆదరించి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినీప్రముఖులను కోరారు. ఫిల్మ్​నగర్​లోని ఎఫ్ఎన్​సీసీ క్లబ్​లో చలన చిత్ర కార్మిక సమాఖ్య ప్రతినిధులు, చిత్రపురి హిల్స్ కాలనీ సభ్యులతో సమావేశమయ్యారు. తన కుమారుడు సాయిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సాయికిరణ్ గెలిపిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాల్లో యువతరానికి ప్రాధాన్యతనిస్తే దేశం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

తెలుగు సినీ ప్రముఖులతో సమావేశమైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఇవీ చూడండి:మహబూబాబాద్​, ఖమ్మంలో నేడు కేసీఆర్​ పర్యటన

తనలాగే తన కుమారుడు సాయికిరణ్​ను ఆదరించి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినీప్రముఖులను కోరారు. ఫిల్మ్​నగర్​లోని ఎఫ్ఎన్​సీసీ క్లబ్​లో చలన చిత్ర కార్మిక సమాఖ్య ప్రతినిధులు, చిత్రపురి హిల్స్ కాలనీ సభ్యులతో సమావేశమయ్యారు. తన కుమారుడు సాయిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సాయికిరణ్ గెలిపిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాల్లో యువతరానికి ప్రాధాన్యతనిస్తే దేశం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

తెలుగు సినీ ప్రముఖులతో సమావేశమైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఇవీ చూడండి:మహబూబాబాద్​, ఖమ్మంలో నేడు కేసీఆర్​ పర్యటన

sample description
Last Updated : Apr 4, 2019, 1:56 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.