ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

author img

By

Published : Jan 29, 2020, 1:18 PM IST

సికింద్రాబాద్ అల్వాల్​లో రైల్వే ట్రాక్​ పక్కనే ఉన్న కరెంట్ స్తంభానికి ఉరి వేసుకొని ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

suspect death at Alwal in Secundrabad
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూదేవి నగర్​లోని రైల్వే ట్రాక్ పక్కనే ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న కరెంటు స్తంభానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి మరణానికి సంబంధించిన కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. నిన్న రాత్రి సమయంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ఇవీ చూడండి: కరీంనగర్ మేయర్​ అభ్యర్థిని ఖరారు చేసిన తెరాస

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూదేవి నగర్​లోని రైల్వే ట్రాక్ పక్కనే ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న కరెంటు స్తంభానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి మరణానికి సంబంధించిన కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. నిన్న రాత్రి సమయంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ఇవీ చూడండి: కరీంనగర్ మేయర్​ అభ్యర్థిని ఖరారు చేసిన తెరాస

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.