అసెంబ్లీ ముట్టడికి విద్యార్థి నాయకుల విఫలయత్నం - latestnews Student youth JAC leaders arrested
ఆంధ్రప్రదేశ్ గుంటూరులో అసెంబ్లీ కార్యక్రమానికి బయల్దేరిన విద్యార్థి యువజన ఐకాస నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని అంటూ.. ఏపీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రావిపాటి సాయి, మహంకాళి సుబ్బరావు, బట్టగిరి వెంకటేశ్వరరెడ్డి, షేక్ జిలానీ తదితరులను బృందావన్ గార్డెన్ కూడలిలో అరెస్ట్ చేశారు. నిరసనగా వీరు నల్ల బెలూన్లు ఎగరేశారు. పోలీసులు వారిని బలవంతంగా రైల్వే కల్యాణ మండపానికి తరలించారు.