ETV Bharat / state

నయీం కేసులో సిట్​ దర్యాప్తు ముమ్మరం

రౌడీ షీటర్​ నయీం కేసులో సిట్​ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. 2 వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను గుర్తించారు. రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సిట్ నిర్ణయించింది.

author img

By

Published : Apr 18, 2019, 1:40 PM IST

నయీం ఆస్తులు

నయీం కేసులో సిట్ దర్యాప్తు పూర్తికావొచ్చింది. అతని అక్రమ ఆస్తులు రూ.2 వేల కోట్లకు పైగానే ఉన్నట్లు విచారణ బృందం గుర్తించింది. వేయి ఎకరాల భూమి, ఇళ్ల స్థలాలు, 29 భవనాలు, రూ.2 కోట్లకు పైగా నగదు, 2 కిలోల బంగారు ఆభరణాలతో సహా ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాలు గుర్తించి సీజ్​ చేశారు. నయీంపై ఇప్పటివరకు 200కు పైగా కేసులున్నాయి. వీటిలో ఆధారాలు లేని వాటిని న్యాయస్థానం అనుమతితో మూసేశారు.

కుడిభుజం శేషన్న కోసం గాలింపు

నయీం కుడిభుజంగా పేరొందిన శేషన్న కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. ఇతను రెండున్నరేళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. పోలీసుల కన్నుగప్పి మకాం మారుస్తున్నట్లు సిట్​ గుర్తించింది. ఇతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే రెండు నెలల్లోనే కేసులన్నీ పరిష్కారమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

నయీం కేసులో దర్యాప్తు వేగవంతం

ఇదీ చదవండి : పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రేమజంట ఆత్మహత్య

నయీం కేసులో సిట్ దర్యాప్తు పూర్తికావొచ్చింది. అతని అక్రమ ఆస్తులు రూ.2 వేల కోట్లకు పైగానే ఉన్నట్లు విచారణ బృందం గుర్తించింది. వేయి ఎకరాల భూమి, ఇళ్ల స్థలాలు, 29 భవనాలు, రూ.2 కోట్లకు పైగా నగదు, 2 కిలోల బంగారు ఆభరణాలతో సహా ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాలు గుర్తించి సీజ్​ చేశారు. నయీంపై ఇప్పటివరకు 200కు పైగా కేసులున్నాయి. వీటిలో ఆధారాలు లేని వాటిని న్యాయస్థానం అనుమతితో మూసేశారు.

కుడిభుజం శేషన్న కోసం గాలింపు

నయీం కుడిభుజంగా పేరొందిన శేషన్న కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. ఇతను రెండున్నరేళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. పోలీసుల కన్నుగప్పి మకాం మారుస్తున్నట్లు సిట్​ గుర్తించింది. ఇతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే రెండు నెలల్లోనే కేసులన్నీ పరిష్కారమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

నయీం కేసులో దర్యాప్తు వేగవంతం

ఇదీ చదవండి : పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రేమజంట ఆత్మహత్య

Intro:TG_ADB_33_18_MANTRIKI_VINATHI_AVB_G1
దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి..
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన కమీషనర్, కార్మికులు..
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉదయం గాంధీ కూరగాయల మార్కెట్లో మున్సిపల్ సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి మున్సిపల్ కమీషనర్ తో పాటు కార్మికులు , పలు కార్మిక సంఘ నాయకులు వినతి పత్రం అందజేశారు. గాంధీ కూరగాయల మార్కెట్లో కారంకులకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసేవరకు విధుల్లోకి వెళ్ళమని తేల్చి చెప్పారు. కకార్మికుల ఐక్యత వర్ధిల్లాలనంటూ నినాదలు చేపట్టారు. శుక్రవారం హనుమాన్ జయంతి ఉన్నందున వీధుల్లోకి వెళ్లాలని మంత్రి సూచించారు. దాడి విషయం లో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


Body:నిర్మల్


Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 724
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.