హైదరాబాద్లోని మాదాపుర్ శిల్పారామంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శిల్పారామం ఆంపి థియేటర్లలో "శివ భక్త మార్కండేయ " కూచిపూడి నృత్య రూపకాన్ని ప్రముఖ నాట్య గురువర్యులు మద్దాలి ఉష గాయత్రి శిష్య బృందం ప్రదర్శించారు.

ఈ ప్రదర్శనలో మృకండ మరుద్వతి దంపతుల కథ వృత్తాంతాన్ని కూచిపూడి నృత్య రూపకంలో గాయత్రి శిష్య బృందం ఎంతో రక్తికట్టించారు. శివుడిగా వైష్ణవి, పార్వతిగా శ్రీవాణి, మార్కండేయుడిగా అనన్య , యమధర్మరాజుగా రమ్య వేణి మొదలైన కళాకారులు వారి వారి పాత్రలో లీనమమై నాట్యం చేశారు.
ఇదీ చదవండి: శివనామస్మరణలతో మార్మోగిపోయిన శైవ క్షేత్రాలు