మానవాళికి సవాళ్లు విసురుతోన్న ప్రాణాంతక వ్యాధులపై లోతైన అధ్యయనం అవసరమని ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. హైదరాబాద్ హబ్సిగూడలోని సెంటర్ ఫర్ సెల్యూలార్ ఫర్ మాలిక్యూలర్ బయాలజీ-సీసీఎంబీ ఆధ్వర్యంలో ఆరోగ్యరంగంలో కొత్తగా ఏర్పాటైన ఇంక్యుబేషన్ సెంటర్ను ఆయన ప్రారంభించారు.
ఈ కేంద్రం ప్రజారోగ్య విభాగంలో లోతైన అధ్యయనానికి ఉపయోగపడుతుందని జయేశ్ అన్నారు. సాంకేతికతను వాడుకొని నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తుందని తెలిపారు. ఆరోగ్య విభాగంలో పనిచేసే అంకుర సంస్థలకు ఈ కేంద్రం ద్వారా ఫండింగ్ సైతం సమకూరుస్తామని తెలిపారు.
ఇదీ చూడండి : పట్టణ ప్రగతిలో.. పాడుబడ్డ భవనం నుంచి రైలుబడి