ETV Bharat / state

నిఘా నీడలో తెలంగాణ - శాసనసభ పోలింగ్​కు పకడ్బందీ గస్తీ

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2023, 7:45 AM IST

Updated : Nov 29, 2023, 8:50 AM IST

Security in Telangana Assembly Election Polling 2023 : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం పోలీస్‌ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటివరకు రాజకీయ పార్టీల ప్రచారంపై దృష్టి కేంద్రీకరించిన పోలీసు ఉన్నతాధికారులు.. గురువారం జరిగే పోలింగ్‌ను శాంతియుత వాతావారణంలో నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు. ఈవీఎంలు తరలించే దగ్గరి నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ..ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Police Security Arrangements Ready for Polls
Police Security Arrangements Ready for Polls

శాసనసభ ఎన్నికల కోసం భారీ బందోబస్తు

Security in Telangana Assembly Election Polling 2023 : పోలింగ్‌కు సమయం సమీపిస్తున్న కొద్దీ పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లు నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 144 సెక్షన్‌ను (Telangana Assembly Elections) విధించారు. 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 30 ఉదయం 6గంటల వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఐదుగురి కంటే ఎక్కువ గుమిగూడవద్దని హెచ్చరించారు.

మద్యం, కల్లు దుకాణాలు, బార్లు 48 గంటలపాటు మూసివేయాలని.. పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోసం విధుల్లో భారీగా సిబ్బందిని మోహరించారు . 45,000 ల రాష్ట్ర పోలీసులు.. 3000 ఇతర శాఖలకు చెందిన రక్షకభటులు, 50 కంపెనీల ప్రత్యేక పోలీసులు, 375 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. వీళ్లకు అదనంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా నుంచి 23,000ల హోంగార్డులు సైతం ఎన్నికల్లో సేవలందించనున్నారు .

ఇట్స్‌ ఓటర్‌ టైం - శాసనసభ ఎన్నికల్లో అసలైన ఘట్టానికి రంగం సిద్ధం

Police Security Arrangements Ready for Polls : సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో.. అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక పోలీసులతోపాటు కేంద్ర సాయుధ బలగాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పహారా ఉంచనున్నారు. కెమెరా మౌంటెడ్ వాహనాలను మోహరించనున్నారు . గస్తీ వాహనాలు సైతం పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో చక్కర్లు కొట్టనున్నాయి. పోలింగ్ కేంద్రాల (Polling Centers in Telangana) వద్ద ఏదైనా సమస్య తలెత్తినట్లు తెలియగానే నిమిషాల్లో అక్కడికి చేరుకునే విధంగా సత్వర స్పందన బృందాలను ఏర్పాటు చేశారు.

ఓటు హక్కే కాదు! బాధ్యత కూడా- గతంలో కంటే మెరుగైన పోలింగ్​ శాతం వచ్చేందుకు ప్రయత్నాలు

Polling Arrangements in Telangana Elections 2023 : పోలింగ్ కేంద్రాల్లోని కెమెరాలను.. కమాండ్ కంట్రోల్ కేంద్రాలకు అనుసంధానం చేశారు. ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షిస్తూ అవసరాన్ని బట్టి.. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్న అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఈవీఎంల తరలింపు సైతం పకడ్బందీగా చేయనున్నారు. ఈవీఎంలు తీసుకెళ్లే వాహనాలకు.. కేంద్ర సాయుధ బలగాలకు చెందిన పోలీసులు రక్షణగా ఉండనున్నారు.

మీరు తొలిసారి ఓటు వేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

Telangana Assembly Elections 2023 : ఇప్పటికే ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాల వద్ద.. కేంద్ర రక్షణ బలగాలు 24 గంటల పాటు పహారా కాస్తున్నాయి. సీసీ కెమెరాలతోపాటు మూడంచెల భద్రత కల్పించారు. పోలింగ్ రోజు పోలింగ్ బూత్ ఎదుట మహిళలు ఒక వరుస, పురుషులు మరో వరుసలో నిలబడాలని.. అంతకంటే ఎక్కువ వరుసలు ఉండొద్దని పోలీసు అధికారులు స్పష్టంచేశారు. ఓటర్లందరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తున్న పోలీసులు.. ఏదైనా సమస్య తలెత్తితే డయల్ 100కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

"పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశాం. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశాం. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు అందుబాటులో ఉన్నాయి. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా. తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. ఓటర్లందరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేసుకోవచ్చు." - డీఎస్‌ చౌహాన్‌, రాచకొండ సీపీ

తొలిసారి ఓటు వేసేందుకు ఉవ్విళ్లూరుతున్న యువతరం

ఓటు ఒక వజ్రాయుధం - మరి ఓటేస్తానికి మీరు సిద్ధమా

శాసనసభ ఎన్నికల కోసం భారీ బందోబస్తు

Security in Telangana Assembly Election Polling 2023 : పోలింగ్‌కు సమయం సమీపిస్తున్న కొద్దీ పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లు నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 144 సెక్షన్‌ను (Telangana Assembly Elections) విధించారు. 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 30 ఉదయం 6గంటల వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఐదుగురి కంటే ఎక్కువ గుమిగూడవద్దని హెచ్చరించారు.

మద్యం, కల్లు దుకాణాలు, బార్లు 48 గంటలపాటు మూసివేయాలని.. పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోసం విధుల్లో భారీగా సిబ్బందిని మోహరించారు . 45,000 ల రాష్ట్ర పోలీసులు.. 3000 ఇతర శాఖలకు చెందిన రక్షకభటులు, 50 కంపెనీల ప్రత్యేక పోలీసులు, 375 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. వీళ్లకు అదనంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా నుంచి 23,000ల హోంగార్డులు సైతం ఎన్నికల్లో సేవలందించనున్నారు .

ఇట్స్‌ ఓటర్‌ టైం - శాసనసభ ఎన్నికల్లో అసలైన ఘట్టానికి రంగం సిద్ధం

Police Security Arrangements Ready for Polls : సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో.. అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక పోలీసులతోపాటు కేంద్ర సాయుధ బలగాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పహారా ఉంచనున్నారు. కెమెరా మౌంటెడ్ వాహనాలను మోహరించనున్నారు . గస్తీ వాహనాలు సైతం పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో చక్కర్లు కొట్టనున్నాయి. పోలింగ్ కేంద్రాల (Polling Centers in Telangana) వద్ద ఏదైనా సమస్య తలెత్తినట్లు తెలియగానే నిమిషాల్లో అక్కడికి చేరుకునే విధంగా సత్వర స్పందన బృందాలను ఏర్పాటు చేశారు.

ఓటు హక్కే కాదు! బాధ్యత కూడా- గతంలో కంటే మెరుగైన పోలింగ్​ శాతం వచ్చేందుకు ప్రయత్నాలు

Polling Arrangements in Telangana Elections 2023 : పోలింగ్ కేంద్రాల్లోని కెమెరాలను.. కమాండ్ కంట్రోల్ కేంద్రాలకు అనుసంధానం చేశారు. ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షిస్తూ అవసరాన్ని బట్టి.. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్న అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఈవీఎంల తరలింపు సైతం పకడ్బందీగా చేయనున్నారు. ఈవీఎంలు తీసుకెళ్లే వాహనాలకు.. కేంద్ర సాయుధ బలగాలకు చెందిన పోలీసులు రక్షణగా ఉండనున్నారు.

మీరు తొలిసారి ఓటు వేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

Telangana Assembly Elections 2023 : ఇప్పటికే ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాల వద్ద.. కేంద్ర రక్షణ బలగాలు 24 గంటల పాటు పహారా కాస్తున్నాయి. సీసీ కెమెరాలతోపాటు మూడంచెల భద్రత కల్పించారు. పోలింగ్ రోజు పోలింగ్ బూత్ ఎదుట మహిళలు ఒక వరుస, పురుషులు మరో వరుసలో నిలబడాలని.. అంతకంటే ఎక్కువ వరుసలు ఉండొద్దని పోలీసు అధికారులు స్పష్టంచేశారు. ఓటర్లందరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తున్న పోలీసులు.. ఏదైనా సమస్య తలెత్తితే డయల్ 100కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

"పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశాం. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశాం. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు అందుబాటులో ఉన్నాయి. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా. తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. ఓటర్లందరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేసుకోవచ్చు." - డీఎస్‌ చౌహాన్‌, రాచకొండ సీపీ

తొలిసారి ఓటు వేసేందుకు ఉవ్విళ్లూరుతున్న యువతరం

ఓటు ఒక వజ్రాయుధం - మరి ఓటేస్తానికి మీరు సిద్ధమా

Last Updated : Nov 29, 2023, 8:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.