ETV Bharat / state

గవర్నర్​కు సుపరిపాలన వేదిక కార్యదర్శి లేఖ

author img

By

Published : Dec 19, 2019, 10:06 PM IST

ఫిల్మ్​నగర్​ గృహ నిర్మాణ సహకార సంఘంలో అవినీతి జరిగిందని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి.. గవర్నర్​కు లేఖ రాశారు. ఈ అంశంపై అనిశాతో దర్యాప్తు చేయించాలని కోరారు.

గవర్నర్​కు సుపరిపాలన వేదిక కార్యదర్శి లేఖ
గవర్నర్​కు సుపరిపాలన వేదిక కార్యదర్శి లేఖ


ఫిలిం నగర్ గృహ నిర్మాణ సహకార సంఘంలో అవకతవకలు జరిగాయని సుపరిపాలన వేదిక.. గవర్నర్​కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి తమిళి సైకి లేఖ రాశారు. సినీ పరిశ్రమలో పనిచేసే వారికి గృహ నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం 1980లో 95 ఎకరాల భూమి కేటాయించిందని.. దీనికి గాను ఫిలింనగర్ గృహ నిర్మాణ సహకార సంఘం ఎకరాకు 8 వేల 500 చొప్పున చెల్లించిందని ఆయన తెలిపారు. ఫ్లాట్ల కేటాయింపులో ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, అవినీతి చోటు చేసుకున్నాయని పద్మనాభ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

secretary-of-forum-for-good-governance-writes-leeter-to-governer-tamili-sai-soundara-rajan
గవర్నర్​కు సుపరిపాలన వేదిక కార్యదర్శి లేఖ

అక్రమాలు నిర్ధరణ అయ్యాయి..

రాధాకృష్ణ కమిషన్, కిరణ్మయి, భాస్కరాచారి నివేదికలో అక్రమాలు నిర్ధరణ అయ్యాయని.. నివేదిక బయటికి రాకుండా చేస్తున్నారని పద్మనాభ రెడ్డి తెలిపారు. ఫిల్మ్ నగర్ గృహ నిర్మాణ సహకార సంఘం కార్యదర్శి సూర్యనారాయణ, సినీ నటుడు మురళి మోహన్ అక్రమాలకు పాల్పడ్డారని నివేదికలో తెలినట్లు పద్మనాభ రెడ్డి లేఖలో ఆరోపించారు.

నివాస సముదాయాలను వాణిజ్య సముదాయాలుగా మార్చారని, పార్క్ స్థలంలోనూ నిర్మాణాలు చేశారని ఆయన తెలిపారు. నివేదికలోని అంశాలు బయటికి రాకుండా కొంతమంది సచివాలయ అధికారులు కొమ్ము కాస్తున్నారన్నారు. దీనిపై అనిశాతో దర్యాప్తు చేయించి వాస్తవాలు బయటికి తీసుకురావాలని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి.. గవర్నర్​ను కోరారు.

secretary-of-forum-for-good-governance-writes-leeter-to-governer-tamili-sai-soundara-rajan
గవర్నర్​కు సుపరిపాలన వేదిక కార్యదర్శి లేఖ

ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా 36 ఫాస్ట్​ట్రాక్​ కోర్టులు ఏర్పాటు


ఫిలిం నగర్ గృహ నిర్మాణ సహకార సంఘంలో అవకతవకలు జరిగాయని సుపరిపాలన వేదిక.. గవర్నర్​కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి తమిళి సైకి లేఖ రాశారు. సినీ పరిశ్రమలో పనిచేసే వారికి గృహ నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం 1980లో 95 ఎకరాల భూమి కేటాయించిందని.. దీనికి గాను ఫిలింనగర్ గృహ నిర్మాణ సహకార సంఘం ఎకరాకు 8 వేల 500 చొప్పున చెల్లించిందని ఆయన తెలిపారు. ఫ్లాట్ల కేటాయింపులో ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, అవినీతి చోటు చేసుకున్నాయని పద్మనాభ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

secretary-of-forum-for-good-governance-writes-leeter-to-governer-tamili-sai-soundara-rajan
గవర్నర్​కు సుపరిపాలన వేదిక కార్యదర్శి లేఖ

అక్రమాలు నిర్ధరణ అయ్యాయి..

రాధాకృష్ణ కమిషన్, కిరణ్మయి, భాస్కరాచారి నివేదికలో అక్రమాలు నిర్ధరణ అయ్యాయని.. నివేదిక బయటికి రాకుండా చేస్తున్నారని పద్మనాభ రెడ్డి తెలిపారు. ఫిల్మ్ నగర్ గృహ నిర్మాణ సహకార సంఘం కార్యదర్శి సూర్యనారాయణ, సినీ నటుడు మురళి మోహన్ అక్రమాలకు పాల్పడ్డారని నివేదికలో తెలినట్లు పద్మనాభ రెడ్డి లేఖలో ఆరోపించారు.

నివాస సముదాయాలను వాణిజ్య సముదాయాలుగా మార్చారని, పార్క్ స్థలంలోనూ నిర్మాణాలు చేశారని ఆయన తెలిపారు. నివేదికలోని అంశాలు బయటికి రాకుండా కొంతమంది సచివాలయ అధికారులు కొమ్ము కాస్తున్నారన్నారు. దీనిపై అనిశాతో దర్యాప్తు చేయించి వాస్తవాలు బయటికి తీసుకురావాలని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి.. గవర్నర్​ను కోరారు.

secretary-of-forum-for-good-governance-writes-leeter-to-governer-tamili-sai-soundara-rajan
గవర్నర్​కు సుపరిపాలన వేదిక కార్యదర్శి లేఖ

ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా 36 ఫాస్ట్​ట్రాక్​ కోర్టులు ఏర్పాటు

TG_HYD_08_20_FGG_COMPLAINT_TO_GOVERNOR_AV_3181326 రిపోర్టర్-శ్రీకాంత్ NOTE- ఫీడ్ డెస్క్ వాట్సాప్ కు వచ్చింది. ( ) ఫిలిం నగర్ గృహ నిర్మాణ సహకార సంఘంలో అవకతవకలు జరిగాయని సుపరిపాలన వేదిక గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి గవర్నర్ కు లేఖ రాశారు. సినీ పరిశ్రమలో పనిచేసే వారికి గృహ నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం 1980లో 95 ఎకరాల భూమి కేటాయించిందని.... దీనికి గాను ఫిలింనగర్ గృహ నిర్మాణ సహకార సంఘం ఎకరాలకు 8500 రూపాయుల చొప్పున చెల్లించిందని ఆయన తెలిపారు. ఫ్లాట్ల కేటాయింపులో అశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, అవినీతి చోటు చేసుకున్నాయని పద్మనాభ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. రాధాకృష్ణ కమిషన్, కిరణ్మయి, భాస్కరాచారి నివేదికలో అక్రమాలు నిర్ధారణ అయ్యాయని... నివేదిక బయటికి రాకుండా చేస్తున్నారని పద్మనాభ రెడ్డి తెలిపారు. ఫిల్మ్ నగర్ గృహ నిర్మాణ సహకార సంఘం కార్యదర్శి సూర్యనారాయణ, సినీ నటుడు మురళి మోహన్ అక్రమాలకు పాల్పడ్డారని నివేదికలో తెలినట్లు పద్మనాభ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. నివాస సముదాయాలను వాణిజ్య సముదాయాలు గా మార్చారని, పార్క్ స్థలం లోనూ నిర్మాణాలు చేశారని పద్మనాభ రెడ్డి తెలిపారు. నివేదికలోని అంశాలు బయటికి రాకుండా సచివాలంయోలనూ కొంత మంది అధికారులు కొమ్ము కాస్తున్నారని... దీనిపై అనిశాతో దర్యాప్తు చేయించి వాస్తవాలు బయటికి తీసుకురావాలని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి... గవర్నర్ ను కోరారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.