తెరాస కోవర్టుగా సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఖండించారు. పీసీసీ అవకాశమిస్తే సీనియర్ నాయకుల సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అందరిని సమన్వయం చేసుకుని పోతానని తెలిపారు.
కొందరు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేవిధంగా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విమర్శలు చేయాలనుకునేవారు.. వారి పేరు, ఫోన్ నంబర్లు కూడా జత చేయాలని... అలా చేస్తే తానే స్వయంగా వాళ్ల ఇంటికి వెళ్లి వివరణ ఇస్తానని తెలిపారు.
ఇవీ చూడండి: బైరామల్గూడ పైవంతెనను ప్రారంభించిన కేటీఆర్