ETV Bharat / state

విస్తరణే ధ్యేయంగా ఆర్​ఎస్​ఎస్​ అడుగులు

author img

By

Published : Dec 27, 2019, 6:07 AM IST

Updated : Dec 27, 2019, 7:32 AM IST

తెలంగాణలో ఆర్ఎస్ఎస్ బలోపేతమే లక్ష్యంగా హైదరాబాద్​లో మూడు రోజుల పాటు విజయ సంకల్ప శిబిరాన్ని నిర్వహించారు. సంఘ్​ సర్​సంఘ్​ చాలక్​ మోహన్​ భగవత్ హాజరై.. ​రాష్ట్రంలో 2024 నాటికి 5 లక్షల సభ్యత్వలతో 10వేల గ్రామాల్లో విస్తరించేలా కృషి చేయాలన్నారు. చివరిరోజు సంఘ్​ పరివార్‌లో వివిధ క్షేత్రాలైన భాజపా, బీఎంఎస్, ఏబీవీపీ, కిసాన్ సంఘ్​లోని ముఖ్యనేతలతో గంటన్నరపాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

rss-focus-on-telangana
విస్తరణే ధ్యేయంగా ఆర్​ఎస్​ఎస్​ అడుగులు
తెలంగాణలో విస్తరణే ధ్యేయంగా ఆర్​ఎస్​ఎస్​ అడుగులు

భారతదేశ సమగ్రత, అభివృద్ధి కోసం అందరితో ప్రేమగా వ్యవహరించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్​ చాలక్ మోహన్ భగవత్ ఉద్బోధించారు. హైదరాబాద్​లో ముడు రోజుల పాటు జరుగుతున్న విజయ సంకల్ప శిబిరంలో భాగంగా చివరిరోజు సంఘ పరివార్‌లో వివిధ క్షేత్రాలైన భాజపా, బీఎంఎస్, ఏబీవీపీ, కిసాన్ సంఘ్​లోని ముఖ్యనేతలతో గంటన్నరపాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భాజపా నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్, జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు, ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, బండి సంజయ్, అర్వింద్, బాపురావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు.

ఏ మతానికి వ్యతిరేకం కాదు

భాషా విధానం తదితర అంశాలపై వివిధ క్షేత్రాల నేతల ప్రశ్నలకు భగవత్ స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టం, అనంతర పరిణామాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ మాట్లాడారు. హిందుత్వాన్ని కాపాడుకునేందుకు గట్టిగా పనిచేయాలని సూచించారు. ముస్లింలు, క్రిస్టియన్లు.. ఏ మతానికి హిందుత్వం వ్యతిరేకం కాదని.. ఆ మతాలవారిని రెచ్చగొట్టే నేతలకే వ్యతిరేకమని స్పష్టం చేశారు.

ప్రాంతీయ భాషకు ప్రాధాన్యతనివ్వాలి

వాస్తవాలను అందరికీ అర్థమయ్యేలా చూడాలని వివరించారు. సంఘ్ మాతృభాషకు ప్రాధాన్యమిస్తుందని... ఇంగ్లీష్ నేర్చుకోవాలి.. కానీ ఏ రాష్ట్రంలో అక్కడి ప్రాంతీయ భాషకు ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. తెలంగాణలో 2024 నాటికి 5 లక్షల సభ్యత్వంతో 10వేల గ్రామాల్లో విస్తరించేలా కృషి చేయాలన్నారు.

ఇవీ చూడండి: 'ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనివారు నా గురించి మాట్లాడుతున్నారు'

తెలంగాణలో విస్తరణే ధ్యేయంగా ఆర్​ఎస్​ఎస్​ అడుగులు

భారతదేశ సమగ్రత, అభివృద్ధి కోసం అందరితో ప్రేమగా వ్యవహరించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్​ చాలక్ మోహన్ భగవత్ ఉద్బోధించారు. హైదరాబాద్​లో ముడు రోజుల పాటు జరుగుతున్న విజయ సంకల్ప శిబిరంలో భాగంగా చివరిరోజు సంఘ పరివార్‌లో వివిధ క్షేత్రాలైన భాజపా, బీఎంఎస్, ఏబీవీపీ, కిసాన్ సంఘ్​లోని ముఖ్యనేతలతో గంటన్నరపాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భాజపా నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్, జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు, ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, బండి సంజయ్, అర్వింద్, బాపురావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు.

ఏ మతానికి వ్యతిరేకం కాదు

భాషా విధానం తదితర అంశాలపై వివిధ క్షేత్రాల నేతల ప్రశ్నలకు భగవత్ స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టం, అనంతర పరిణామాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ మాట్లాడారు. హిందుత్వాన్ని కాపాడుకునేందుకు గట్టిగా పనిచేయాలని సూచించారు. ముస్లింలు, క్రిస్టియన్లు.. ఏ మతానికి హిందుత్వం వ్యతిరేకం కాదని.. ఆ మతాలవారిని రెచ్చగొట్టే నేతలకే వ్యతిరేకమని స్పష్టం చేశారు.

ప్రాంతీయ భాషకు ప్రాధాన్యతనివ్వాలి

వాస్తవాలను అందరికీ అర్థమయ్యేలా చూడాలని వివరించారు. సంఘ్ మాతృభాషకు ప్రాధాన్యమిస్తుందని... ఇంగ్లీష్ నేర్చుకోవాలి.. కానీ ఏ రాష్ట్రంలో అక్కడి ప్రాంతీయ భాషకు ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. తెలంగాణలో 2024 నాటికి 5 లక్షల సభ్యత్వంతో 10వేల గ్రామాల్లో విస్తరించేలా కృషి చేయాలన్నారు.

ఇవీ చూడండి: 'ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనివారు నా గురించి మాట్లాడుతున్నారు'

Tg_hyd_03_27_rss_focus_on_telangana_pkg_3182061 రిపోర్టర్: జ్యోతికిరణ్ Note: ఫైల్ విజువల్స్ వాడుకోగలరు ( ) సంఘ్ పై వ్యతిరేక ప్రచారం చేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, భారతదేశ సమగ్రత, అభివృద్ధి కోసం అందరితో ప్రేమగా వ్యవహరించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ ఉద్బోదించారు. హైదరాబాద్ లో ముడు రోజుల పాటు జరుగుతున్న విజయ సంకల్ప శిబిరంలో భాగంగా చివరిరోజు సంఘ పరివార్‌లో వివిధ క్షేత్రాలైన భాజపా, బీఎంఎస్, ఏబీవీపీ, కిసాన్ సంఘ్ లోని ముఖ్యనేతలతో గంటన్నరపాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు......Look Vo: తెలంగాణలో ఆర్ఎస్ఎస్ ను బలోపేతం చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ నగర శివారులో మూడు రోజుల పాటు విజయ సంకల్ప శిబిరాన్ని నిర్వహించారు. చివరి రోజు శిక్షణలో భాగంగా సంఘ పరివార్‌లోని వివిధ క్షేత్రాలైన భాజపా, బీఎంఎస్, ఏబీవీపీ, కిసాన్ సంఘ్ లోని ముఖ్యనేతలతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భాజపా నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్, జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు, ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, బండి సంజయ్, అర్వింద్, బాపూరావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు. భాషా విధానం తదితర అంశాలపై వివిధ క్షేత్రాల నేతల ప్రశ్నలకూ భగవత్ స్పందించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పొరసత్వ సవరణ చట్టం, అనంతర పరిణామాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ మాట్లాడారు. హిందుత్వాన్ని కాపాడుకునేందుకు గట్టిగా పనిచేయాలని సూచించారు. ముస్లింలు, క్రిస్టియన్లు.. ఏ మతానికి హిందుత్వం వ్యతిరేకం కాదని... ఆ మతాలవారిని రెచ్చగొట్టే నేతలకే మనం వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఘర్షణలతో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదన్నారు. వాస్తవాలను అందరికీ అర్థమయ్యేలా చూడాలని వివరించారు. దేశంలో అనేక రాష్ట్రాలున్నాయి. సంఘ్ మాతృభాషకు ప్రాధాన్యమిస్తుందని... ఇంగ్లిష్ నేర్చుకోవాలి... కానీ ఏ రాష్ట్రంలో అక్కడి ప్రాంతీయ భాషకు ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. స్వదేశీ వస్తువులను ఎక్కువగా వాడాలని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మత మార్పిడిలపై ఓ నేత ప్రస్తావించగా మతమార్పిడిలు మంచిది కాదని ఎవరి మతాన్ని వారు అభిమానించాలన్నారు. మతమార్పిడిలు ఎందుకు జరుగుతున్నాదానిపై లోతుగా ఆలోచించాలని సూచించినట్లు సమాచారం Evo: తెలంగాణలో 2024 నాటికి 5 లక్షల సభ్యత్వంతో 10వేల గ్రామాల్లో విస్తరించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప శిబిరం విజయవంతంగా ముగిసింది
Last Updated : Dec 27, 2019, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.