మేడ్చల్ జిల్లా కీసర మండలం బండ్లగూడలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంతో వచ్చిన పాల డబ్బాల ఆటో, ఇనుప రాడ్ల లోడుతో వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
వినోద్.. కరీంగూడా నుంచి నాగారానికి వస్తున్నాడు. ఈక్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : 'జుమ్మేరాత్ బజార్లో సగం ధరకే అమ్ముతా...'