Revanth Reddy Pays Tribute To Rajiv Gandhi : వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ది చెప్పి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి(Rajiv Gandhi Jayanthi) సందర్భంగా సోమాజీగూడలోని రాజీవ్ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. రేవంత్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్రావు ఠాక్రే, అంజన్ కుమార్, వి.హనుమంతరావు, జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Rajiv Gandhi birth anniversary celebrations in Hyderabad : బీజేపీ, బీఆర్ఎస్ నాణానికి బొమ్మ-బొరుసు లాంటివని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) విమర్శలు చేశారు. వారిద్దరిదీ ఫెవికాల్ బంధమన్నారు. దేశ సంపదను మోదీ తన మిత్రులకు దోచి పెడుతుంటే.. కేసీఆర్ రాష్ట్ర సంపదను తన కుటుంబ సభ్యులకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి ప్రజలు.. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. మణిపుర్ మండుతున్నా.. ప్రధాని అక్కడి ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Telangana Congress Party Released Campaign Poster : 'తిరగబడదాం- తరిమికొడదాం' నినాదంతో కాంగ్రెస్
Revanth Reddy Remember Services Of Rajiv Gandhi : ఈ సందర్భంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన సేవలు, అభివృద్ధిని రేవంత్ రెడ్డి, ముఖ్య నేతలు గుర్తు చేసుకున్నారు. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసి.. మహిళలకు రిజర్వేషన్లు కల్పించిది కూడా ఆయనే అని కొనియాడారు. సాంకేతిక విప్లవానికి తెర దీసింది.. అందుకు తగ్గ అడుగులు వేసింది రాజీవ్ గాంధీనే అని అన్నారు. సెల్ఫోన్తో మరో విప్లవానికి నాంది పలికి.. నేడు అందరి చేతిలో ఫోన్ ఉన్నదంటే కారణం ఆయనే అని తెలిపారు.
"యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుంది. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసింది రాజీవ్ గాంధీనే. మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది రాజీవ్ గాంధీనే. సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీనే. ఆనాడు రాజీవ్ గాంధీ చేసిన కృషితోనే ఐటీ ఇంత అభివృద్ధి చెందింది.టెలికాం రంగంలో మార్పులు తెచ్చి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. పిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి యువతకు ఆదర్శంగా నిలిచారు. దేశంలో విభజించు-పాలించు విధానాన్ని బీజేపీ అవలంబిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ నాణానికి బొమ్మ, బొరుసులాంటివి." - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
Revanthreddy on Assembly Seats : 'రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యతను నేను తీసుకుంటా'
Rajiv Gandhi Jayanthi 2023 : ఆనాడు రాజీవ్ గాంధీ చేసిన కృషితోనే ఐటీ ఇంత అభివృద్ధి చెందిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి.. నేడు అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. పిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి యువతకు ఆదర్శంగా నిలిచారని వివరించారు. పేదల కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబం రాజీవ్ గాంధీదే అని ఆవేదన చెందారు. దేశంలో బ్రిటీష్ వారి విధానమైన విభజించు, పాలించు విధానాన్ని ఇప్పుడున్న బీజేపీ అవలంబిస్తోందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.