ETV Bharat / state

రిజిస్ట్రేషన్ల సమస్యపై ప్రజాప్రతినిధులకు వినతిపత్రం - రిజిస్ట్రేషన్​ సమస్యలపై ప్రజా ప్రతినిధులను కలిసిన స్థిరాస్తి వ్యాపారులు

ప్రస్తుతం కొత్త విధానంలో చేస్తున్న వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలంటూ స్థిరాస్తి వ్యాపారులు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్​కుమార్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. నూతన విధానం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని... ప్రభుత్వం నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు.

realters request for mla,mlc  on the issue of registrations in new system
రిజిస్ట్రేషన్ల సమస్యపై ప్రజాప్రతినిధులకు వినతిపత్రం
author img

By

Published : Dec 15, 2020, 6:00 PM IST

ధరణి పోర్టల్​ ద్వారా రిజిస్ట్రేషన్​ వల్ల వినియోగదారులు పడుతున్న ఇబ్బందులపై స్థిరాస్తి వ్యాపారులు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్​కుమార్​ను కలిశారు. పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. నూతన విధానంలో ఇబ్బందుల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు.

కొత్త విధానంపై రాష్ట్రప్రభుత్వం నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్​కు సిద్ధంగా ఫ్లాట్లను పాత విధానంలోనే పూర్తి చేసేలా మినహాయింపు ఇవ్వాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్​ బిల్డర్స్​ అసోసియేషన్​ అధ్యక్షులు ముప్పా సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి ప్రేమ్​ కుమార్, సభ్యులు సత్య శ్రీరంగం, స్థిరాస్తి వ్యాపారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రిజిస్ట్రేషన్ల ప్రక్రియ విభజనకు నిర్ణయం: ప్రశాంత్​ రెడ్డి

ధరణి పోర్టల్​ ద్వారా రిజిస్ట్రేషన్​ వల్ల వినియోగదారులు పడుతున్న ఇబ్బందులపై స్థిరాస్తి వ్యాపారులు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్​కుమార్​ను కలిశారు. పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. నూతన విధానంలో ఇబ్బందుల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు.

కొత్త విధానంపై రాష్ట్రప్రభుత్వం నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్​కు సిద్ధంగా ఫ్లాట్లను పాత విధానంలోనే పూర్తి చేసేలా మినహాయింపు ఇవ్వాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్​ బిల్డర్స్​ అసోసియేషన్​ అధ్యక్షులు ముప్పా సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి ప్రేమ్​ కుమార్, సభ్యులు సత్య శ్రీరంగం, స్థిరాస్తి వ్యాపారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రిజిస్ట్రేషన్ల ప్రక్రియ విభజనకు నిర్ణయం: ప్రశాంత్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.