ETV Bharat / state

విశాఖలో అమానుషం: పదేళ్ల చిన్నారిపై కర్కశంగా...

విశాఖలో ఓ కీచకపర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదేళ్ల చిన్నారి కాళ్లు కట్టేసి, నోటిలో గుడ్డలు కుక్కి అత్యాచారానికి యత్నించాడు ఓ మృగాడు. స్థానిక చిన్నారులు ఇది గమనించి అరవటంతో నిందితుడు పరారయ్యాడు. గతంలో సొంత సోదరిపైనా అత్యాచారయత్నం చేశాడు నిందితుడు.

author img

By

Published : Aug 29, 2019, 8:00 PM IST

Updated : Aug 29, 2019, 8:07 PM IST

విశాఖలో అమానుషం... పదేళ్ల చిన్నారినీ వదల్లేదు...

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో పదేళ్ల బాలికపై రాజేశ్ అనే యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఈ నెల 27న స్థానిక ఓ కాలనీలో సైకిల్ నేర్చుకుంటున్న బాలికను ఓ కారులోకి తీసుకువెళ్లి రాజేశ్ బలాత్కారం చేశాడు. బాలికపై అత్యాచారయత్నం చేస్తున్న సమయంలో కారు కదలటం చూసిన తోటి పిల్లలు వాహన అద్దాలపై గట్టిగా కొట్టి అరిచారు. దీంతో రాజేశ్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. కారులో బాలిక కాళ్లు కట్టేసి నోటిలో గుడ్డలు కుక్కి ఉండడాన్ని చూసిన పిల్లలు వాటిని తొలగించి బాధితురాలిని ఇంటికి చేర్చారు. రోజు కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులు అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చాక బాలిక ద్వారా జరిగిన ఘోరాన్ని తెలుసుకున్నారు. మహిళా చేతన సంస్థ సహకారంతో బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం గాలిస్తోంది. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు. అదే కాలనీలో ఓ తుక్కు దుకాణంలో రాజేశ్ పని చేస్తున్నాడు.

బాలిక తల్లిదండ్రులను నిందితుడి సోదరి కలిసి ఆవేదన వ్యక్తం చేసింది. తనపైనా గతంలో టోనీ అత్యాచారయత్నం చేసినట్లు పోలీసుల వద్ద ఆమె వెల్లడించింది.

ఇదీ చూడండి : పోకిరీని చెట్టుకు కట్టేసి చితక్కొట్టింది..

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో పదేళ్ల బాలికపై రాజేశ్ అనే యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఈ నెల 27న స్థానిక ఓ కాలనీలో సైకిల్ నేర్చుకుంటున్న బాలికను ఓ కారులోకి తీసుకువెళ్లి రాజేశ్ బలాత్కారం చేశాడు. బాలికపై అత్యాచారయత్నం చేస్తున్న సమయంలో కారు కదలటం చూసిన తోటి పిల్లలు వాహన అద్దాలపై గట్టిగా కొట్టి అరిచారు. దీంతో రాజేశ్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. కారులో బాలిక కాళ్లు కట్టేసి నోటిలో గుడ్డలు కుక్కి ఉండడాన్ని చూసిన పిల్లలు వాటిని తొలగించి బాధితురాలిని ఇంటికి చేర్చారు. రోజు కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులు అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చాక బాలిక ద్వారా జరిగిన ఘోరాన్ని తెలుసుకున్నారు. మహిళా చేతన సంస్థ సహకారంతో బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం గాలిస్తోంది. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు. అదే కాలనీలో ఓ తుక్కు దుకాణంలో రాజేశ్ పని చేస్తున్నాడు.

బాలిక తల్లిదండ్రులను నిందితుడి సోదరి కలిసి ఆవేదన వ్యక్తం చేసింది. తనపైనా గతంలో టోనీ అత్యాచారయత్నం చేసినట్లు పోలీసుల వద్ద ఆమె వెల్లడించింది.

ఇదీ చూడండి : పోకిరీని చెట్టుకు కట్టేసి చితక్కొట్టింది..

Last Updated : Aug 29, 2019, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.