నేడు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల చేయనున్నారు. భక్తుల సౌకర్యార్థం ఈ నెల 22, 23, 24వ తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను బుధవారం ఉదయం 10 గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
రోజుకు ఐదు వేల టికెట్ల చొప్పున విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్చేసుకోవాలని తితిదే సూచించింది.
ఇదీ చదవండి: నవ్వులు పూయిస్తున్న ఏటీఎం దొంగల తతంగం.. ఏం చేశారంటే..!