ETV Bharat / state

బ్యాలెట్ పత్రాలు సిద్ధం... గెలుపెవరిది?

పురపోరు పోలింగ్​కు రంగం సిద్దమవుతోంది. ప్రచార గడువు ముగుస్తోన్న తరుణంలో యంత్రాంగం ఓటింగ్​కు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. బ్యాలెట్ పత్రాల ముద్రణ ఇప్పటికే పూర్తైంది. మిగతా పనులు పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.

author img

By

Published : Jan 19, 2020, 5:01 AM IST

Updated : Jan 19, 2020, 7:16 AM IST

Prepare ballot papers who win in telangana municipal elections
బ్యాలెట్ పత్రాలు సిద్ధం...గెలుపెవరిది?

రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. ప్రచారం చివరి దశకు చేరుకుంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ఇంటింటినీ చుడుతున్నారు. ప్రచార గడువు రేపు సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. ప్రచార గడువు ముగిసి, పోలింగ్ తేదీ సమీపిస్తోన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆ ఏర్పాట్లపై పడింది. పోలింగ్​కు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22న పోలింగ్ జరగనున్న తొమ్మిది నగరపాలక సంస్థలు, 120 కారోరేషన్లు, 325 కార్పొరేటర్, 2727 కౌన్సిలర్ పదవులకు ఓటింగ్​కు అవసరమైన బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేశారు.

కరీంనగర్​లో మాత్రం బ్యాలెట్ పత్రాల ముద్రణ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. పోలింగ్ సిబ్బందికి రెండో దఫా శిక్షణ కూడా పూర్తైంది. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్​కు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 21న వీలైనంత త్వరగా పోలింగ్ కేంద్రాలకు సరంజామాను చేర్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్​కాస్టింగ్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. వెబ్ కాస్టింగ్ లేని చోట వీడియోగ్రఫీ చేయించనున్నారు.

రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. ప్రచారం చివరి దశకు చేరుకుంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ఇంటింటినీ చుడుతున్నారు. ప్రచార గడువు రేపు సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. ప్రచార గడువు ముగిసి, పోలింగ్ తేదీ సమీపిస్తోన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆ ఏర్పాట్లపై పడింది. పోలింగ్​కు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22న పోలింగ్ జరగనున్న తొమ్మిది నగరపాలక సంస్థలు, 120 కారోరేషన్లు, 325 కార్పొరేటర్, 2727 కౌన్సిలర్ పదవులకు ఓటింగ్​కు అవసరమైన బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేశారు.

కరీంనగర్​లో మాత్రం బ్యాలెట్ పత్రాల ముద్రణ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. పోలింగ్ సిబ్బందికి రెండో దఫా శిక్షణ కూడా పూర్తైంది. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్​కు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 21న వీలైనంత త్వరగా పోలింగ్ కేంద్రాలకు సరంజామాను చేర్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్​కాస్టింగ్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. వెబ్ కాస్టింగ్ లేని చోట వీడియోగ్రఫీ చేయించనున్నారు.

ఇదీ చూడండి : కేటీఆర్ ఆస్తులపై విచారణ జరిపించాలి: రేవంత్ రెడ్డి

TG_Hyd_20_19_Muncipolls_Polling_Pkg_3053262 From : Raghu Vardhan ( ) పురపోరు పోలింగ్ కు రంగం సిద్దమవుతోంది. ప్రచార గడువు ముగుస్తోన్న తరుణంలో యంత్రాంగం ఓటింగ్ కు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తి కాగా మిగతా పనులు పూర్తి చేసే పనిలో పడ్డారు...లుక్ వాయిస్ ఓవర్ - పురపాలక ఎన్నికల ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు హోరాహోరీగా ఇంటింటినీ చుడుతున్నారు. ప్రచార గడువు రేపు సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. ఆ తర్వాత ప్రచారానికి ఆస్కారం ఉండదు. ప్రచార గడువు ముగిసి పోలింగ్ తేదీ సమీపిస్తోన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆ ఏర్పాట్లపై పడింది. పోలింగ్ కు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీన పోలింగ్ జరగనున్న తొమ్మిది నగరపాలక సంస్థలు, 120 కారోరేషన్లలో ఓటింగ్ కు అవసరమైన బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేశారు. 325 కార్పొరేటర్, 2727 కౌన్సిలర్ పదవులకు ఎన్నిక కోసం అవసరమైన బ్యాలెట్ పత్రాలను ముద్రించారు. కరీంనగర్ లో మాత్రం బ్యాలెట్ పత్రాల ముద్రణ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. పోలింగ్ సిబ్బందికి రెండో దఫా శిక్షణ కూడా పూర్తైంది. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ కు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేస్తున్నారు. 21వ తేదీన వీలైనంత త్వరగా పోలింగ్ కేంద్రాలకు సరంజామాను చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. వెబ్ కాస్టింగ్ లేని చోట వీడియోగ్రఫీ చేయించనున్నారు.
Last Updated : Jan 19, 2020, 7:16 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.