ETV Bharat / state

'అక్రమంగా తయారు చేసిన శానిటైజరే వారి ప్రాణాలు తీసింది' - ప్రకాశం జిల్లా వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేశామని ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్ అన్నారు. శానిటైజర్ తాగిన 50 మందిని గుర్తించి చికిత్స అందించి కాపాడామన్నారు. పలు శానిటైజర్‌ కంపెనీలలో తనిఖీలు నిర్వహించామన్నారు. పర్‌ఫెక్ట్‌ అనే బ్రాండ్‌ శానిటైజర్‌ను హైదరాబాద్ జీడిమెట్లలో అక్రమంగా తయారు చేస్తున్నట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు. నమూనాలు సేకరించి సెంట్రల్ డ్రగ్ ల్యాబ్‌కు పంపామన్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 10 మందిని అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు.

prakasam-kurichedu-sanitizer-deaths-case-investigated-and-10-members-arrested
'అక్రమంగా తయారు చేసిన శానిటైజరే వారి ప్రాణాలు తీసింది'
author img

By

Published : Aug 11, 2020, 8:02 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా కురిచేడులో జులై 29, 30, 31 తేదీల్లో శానిటైజర్లు తాగి 16 మంది మృతి చెందిన ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. తప్పుడు విధానంలో నకిలీ ఫార్మూలా, నకిలీ కంపెనీతో శానిటైజర్లు తయారుచేసి మార్కెట్‌ చేసిన ప్రధాన నిందితుడితో పాటు, వీటిని విక్రయించిన, సరఫరా చేసిన డీలర్లతో కలిసి 10 మందిని అరెస్టు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్‌ వెల్లడించారు.

యూట్యూబ్ పరిజ్ఞానంతో శానిటైజర్లు తయారీ
హైదరాబాద్‌ జీడిమెట్లలో తయారుచేసిన నకిలీ శానిటైజర్లు ఇంతమంది ప్రాణాలు బలిగొన్నాయని ఎస్పీ తెలిపారు. కరోనాతో శానిటైజర్ల వినియోగం పెరగడంతో ఈ డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలన్న ఉద్దేశంతో... శ్రీనివాసరావు అనే వ్యక్తి తనకు ఉన్న అవగాహన, యూట్యూబ్‌ సాయంతో పర్‌ఫెక్ట్‌ గోల్డ్‌ అనే నకిలీ శానిటైజర్లు తయారు చేస్తున్నారని తెలిపారు. ఈ శానిటైజర్ల వల్ల కురిచేడు ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు.

మార్కాపురం ఓఎస్డీ చౌడేశ్వరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందం గత 10 రోజులుగా సమగ్ర దర్యాప్తు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఇందుకోసం 4, 5 శానిటైజర్ల కంపెనీలను పరిశీలించామని, హైదరాబాద్‌, బెంగళూరు, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో తమ బృందం సమగ్ర దర్యాప్తు నిర్వహించగా, ఇందులో పర్‌ఫెక్ట్‌ గోల్డ్ కంపెనీ వ్యవహారం బయటకు వచ్చిందన్నారు. హైదరాబాద్‌ ప్రశాంత్ నగర్‌కు చెందిన సాలె శ్రీనివాస్ ఆరోతరగతి చదివాడు. అక్రమంగా వీటిని తయారు చేస్తున్నాడని దర్యాప్తులో గుర్తించామన్నారు. గతంలో పెట్రోల్‌ బంకులో పనిచేసి, కొన్నాళ్లు పెయింట్‌ రిమూవర్స్‌ అమ్మడం వంటి పనిచేసిన శ్రీనివాస్​కు రసాయన ఫార్మూలాల మీద కొంత అవగాహన ఉందన్నారు. ఈ అవగాహనతో కొవిడ్‌ సమయంలో శానిటైజర్లకు విపరీతమైన గిరాకీ రావడంతో వీటిని తయారు చేయాలని భావించి జీడిమెట్లలో కంపెనీ పెట్టాడని ఎస్పీ తెలిపారు.

మిథనాల్ వినియోగం వల్లే

తక్కువ ధరకు లభించే మిథనాల్​తో వీటిని తయారుచేస్తున్నారని ఎస్పీ చెప్పారు. సాధారణంగా శానిటైజర్ల తయారీకి ఇథనాల్ వినియోగిస్తారన్నారు. మిథనాల్‌ వినియోగంతో కొంతమంది మద్యంప్రియులు వీటిని తాగుతున్నారని వివరించారు. ఈ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేవని, కాలం చెల్లిన రిజిస్ట్రేషన్‌ నెంబర్​తో లేబుళ్లు తయారుచేసి మార్కెట్లోకి అమ్ముతున్నారని గుర్తించామని ఎస్పీ తెలిపారు. తొలుత ఆటోల్లో శానిటైజర్ విక్రయించేవారని, తర్వాత కేశవ్‌ అగర్వాల్‌ అనే వ్యక్తితో చేతులు కలిపి శానిటైజర్లను డిస్ట్రిబ్యూషన్‌ చేసేవారన్నారు. తప్పుడు పేరుతో కంపెనీ నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న వాణిజ్య పన్నులశాఖ అధికారులు రెండుసార్లు దాడులు చేయగా, వారితో అవగాహన చేసుకుని కేసుల్లేకుండా చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. తక్కువ ధరకు వస్తుందని మెడికల్‌ షాపుల వాళ్లు కూడా వీటిని అమ్మకాలు చేశారని ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్ తెలిపారు.

శానిటైజర్ల అమ్మకానికి రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ చూడకుండా, అనుమతులు ఉన్నాయో లేవో పరిశీలించకుండా విచ్చలవిడిగా విక్రయాలు చేపట్టారు. అందువల్ల తయారీదారుడు శ్రీనివాస్‌ రావుతో పాటు, వీటిని డిస్ట్రిబ్యూట్‌ చేసిన వ్యక్తులను, మెడికల్‌ దుకాణాల యజమానులను మొత్తం 10 మందిని అరెస్టు చేశాం. వీరిలో ప్రాణాంతకమైన రసాయనిక పదార్థాలను అక్రమ మార్గంలో విక్రయించిన మహమ్మద్‌ దావూద్‌, మహమ్మద్‌ హాజి, కేశవ్‌ అగర్వాల్‌, సాలే శివకుమార్‌లు కూడా ఉన్నారని, మిగిలిన వారు మెడికల్‌ దుకాణ యజమానులున్నారు.--- సిద్ధార్ద్ కౌశల్, ఎస్పీ

ఇదీ చదవండి : హైదరాబాద్ ప్రజల భయాందోళనపై నిపుణులు ఏం చెప్పారంటే?

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా కురిచేడులో జులై 29, 30, 31 తేదీల్లో శానిటైజర్లు తాగి 16 మంది మృతి చెందిన ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. తప్పుడు విధానంలో నకిలీ ఫార్మూలా, నకిలీ కంపెనీతో శానిటైజర్లు తయారుచేసి మార్కెట్‌ చేసిన ప్రధాన నిందితుడితో పాటు, వీటిని విక్రయించిన, సరఫరా చేసిన డీలర్లతో కలిసి 10 మందిని అరెస్టు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్‌ వెల్లడించారు.

యూట్యూబ్ పరిజ్ఞానంతో శానిటైజర్లు తయారీ
హైదరాబాద్‌ జీడిమెట్లలో తయారుచేసిన నకిలీ శానిటైజర్లు ఇంతమంది ప్రాణాలు బలిగొన్నాయని ఎస్పీ తెలిపారు. కరోనాతో శానిటైజర్ల వినియోగం పెరగడంతో ఈ డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలన్న ఉద్దేశంతో... శ్రీనివాసరావు అనే వ్యక్తి తనకు ఉన్న అవగాహన, యూట్యూబ్‌ సాయంతో పర్‌ఫెక్ట్‌ గోల్డ్‌ అనే నకిలీ శానిటైజర్లు తయారు చేస్తున్నారని తెలిపారు. ఈ శానిటైజర్ల వల్ల కురిచేడు ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు.

మార్కాపురం ఓఎస్డీ చౌడేశ్వరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందం గత 10 రోజులుగా సమగ్ర దర్యాప్తు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఇందుకోసం 4, 5 శానిటైజర్ల కంపెనీలను పరిశీలించామని, హైదరాబాద్‌, బెంగళూరు, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో తమ బృందం సమగ్ర దర్యాప్తు నిర్వహించగా, ఇందులో పర్‌ఫెక్ట్‌ గోల్డ్ కంపెనీ వ్యవహారం బయటకు వచ్చిందన్నారు. హైదరాబాద్‌ ప్రశాంత్ నగర్‌కు చెందిన సాలె శ్రీనివాస్ ఆరోతరగతి చదివాడు. అక్రమంగా వీటిని తయారు చేస్తున్నాడని దర్యాప్తులో గుర్తించామన్నారు. గతంలో పెట్రోల్‌ బంకులో పనిచేసి, కొన్నాళ్లు పెయింట్‌ రిమూవర్స్‌ అమ్మడం వంటి పనిచేసిన శ్రీనివాస్​కు రసాయన ఫార్మూలాల మీద కొంత అవగాహన ఉందన్నారు. ఈ అవగాహనతో కొవిడ్‌ సమయంలో శానిటైజర్లకు విపరీతమైన గిరాకీ రావడంతో వీటిని తయారు చేయాలని భావించి జీడిమెట్లలో కంపెనీ పెట్టాడని ఎస్పీ తెలిపారు.

మిథనాల్ వినియోగం వల్లే

తక్కువ ధరకు లభించే మిథనాల్​తో వీటిని తయారుచేస్తున్నారని ఎస్పీ చెప్పారు. సాధారణంగా శానిటైజర్ల తయారీకి ఇథనాల్ వినియోగిస్తారన్నారు. మిథనాల్‌ వినియోగంతో కొంతమంది మద్యంప్రియులు వీటిని తాగుతున్నారని వివరించారు. ఈ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేవని, కాలం చెల్లిన రిజిస్ట్రేషన్‌ నెంబర్​తో లేబుళ్లు తయారుచేసి మార్కెట్లోకి అమ్ముతున్నారని గుర్తించామని ఎస్పీ తెలిపారు. తొలుత ఆటోల్లో శానిటైజర్ విక్రయించేవారని, తర్వాత కేశవ్‌ అగర్వాల్‌ అనే వ్యక్తితో చేతులు కలిపి శానిటైజర్లను డిస్ట్రిబ్యూషన్‌ చేసేవారన్నారు. తప్పుడు పేరుతో కంపెనీ నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న వాణిజ్య పన్నులశాఖ అధికారులు రెండుసార్లు దాడులు చేయగా, వారితో అవగాహన చేసుకుని కేసుల్లేకుండా చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. తక్కువ ధరకు వస్తుందని మెడికల్‌ షాపుల వాళ్లు కూడా వీటిని అమ్మకాలు చేశారని ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్ తెలిపారు.

శానిటైజర్ల అమ్మకానికి రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ చూడకుండా, అనుమతులు ఉన్నాయో లేవో పరిశీలించకుండా విచ్చలవిడిగా విక్రయాలు చేపట్టారు. అందువల్ల తయారీదారుడు శ్రీనివాస్‌ రావుతో పాటు, వీటిని డిస్ట్రిబ్యూట్‌ చేసిన వ్యక్తులను, మెడికల్‌ దుకాణాల యజమానులను మొత్తం 10 మందిని అరెస్టు చేశాం. వీరిలో ప్రాణాంతకమైన రసాయనిక పదార్థాలను అక్రమ మార్గంలో విక్రయించిన మహమ్మద్‌ దావూద్‌, మహమ్మద్‌ హాజి, కేశవ్‌ అగర్వాల్‌, సాలే శివకుమార్‌లు కూడా ఉన్నారని, మిగిలిన వారు మెడికల్‌ దుకాణ యజమానులున్నారు.--- సిద్ధార్ద్ కౌశల్, ఎస్పీ

ఇదీ చదవండి : హైదరాబాద్ ప్రజల భయాందోళనపై నిపుణులు ఏం చెప్పారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.