ETV Bharat / state

ప్రజాపాలనకు దరఖాస్తుల వెల్లువ- రెండోరోజు 8,12,862 అప్లికేషన్లు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2023, 7:45 AM IST

Praja palana Second Day Applications in Telangana : ప్రజాపాలన సదస్సులో రెండో రోజూ ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది. తొలిరోజు దరఖాస్తులు 7లక్షలకు పైగా వస్తే, రెండోరోజు రాష్ట్రవ్యాప్తంగా 8,12,862 వచ్చాయి. ఇళ్ల వద్దకు దరఖాస్తులు అందకపోవడం వల్ల బయటనే చాలా మంది కొనుగోలు చేశారు. నిబంధనలు, దరఖాస్తుల వివరాలపై అయోమయం గందరగోళం కొనసాగుతూనే ఉంది.

Seconday Applications in Praja Palana
Praja palana Applications in Telangana State Wide
ప్రజాపాలన దరఖాస్తుల వెల్లువ రెండో రోజు 8,12,862 అప్లికేషన్లు

Praja palana Second Day Applications in Telangana : ప్రజాపాలన సదస్సులో దరఖాస్తుల వెల్లువ కొనసాగుతోంది. ఐదు గ్యారెంటీ పథకాల కోసం రాష్ట్రవ్యాప్తంగా రెండురోజుల్లో 15,59,276 దరఖాస్తులు వచ్చాయి. మొదటిరోజు 7,46,414 దరఖాస్తులు రాగా శుక్రవారం 8,12,862 వచ్చాయి. జీహెచ్​ఎంసీ, ఇతర కార్పొరేషన్లు, పట్టణాల్లో 4,89,000 దరఖస్తులు, గ్రామాల్లో 3,23,862 వచ్చాయి.

దరఖాస్తులు తామే ఉచితంగా ఇస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ, కేంద్రాల సమీపంలో బయటి వ్యక్తులు రూ.20 నుంచి రూ.100 వరకు ఫారాలను అమ్ముతున్నారు. మరోవైపు దరఖాస్తుల్లో నింపాల్సిన అంశాలు, పథకాలకు సంబంధించిన నిబంధనలపై ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. అధికారులు ఒక్కొక్కరు ఒక్కోతీరుగా చెబుతుండడం మరింత గందరగోళానికి దారితీస్తోంది.

జీహెచ్​ఎంసీలో రెండో రోజు భారీగా అభయహస్తం దరఖాస్తులు - ఎక్కువగా వాటి కోసమే

Second Day Praja palana Applications : ప్రజాపాలనపై రెండో రోజూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జనం నుంచి విశేష స్పందన లభిస్తున్నందున ప్రజా సదస్సులలో ఎదురైన సమస్యలను(Praja Palana Issues Telangana) పునరావృతం కాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకున్నారని సీఎస్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తు ఫారాలు విక్రయించకుండా చూడాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ప్రజాపాలన కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను శాంతి కుమారి ఆదేశించారు.

రేషన్​ కార్డుకు దరఖాస్తులు : అభయహస్తం దరఖాస్తులకు రాజధాని వాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రభుత్వం ఆహ్వానించిన ఐదు గ్యారెంటీల్లో నగరవాసులు మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల కోసం పెద్ద సంఖ్యలో అర్జీలు పెట్టుకుంటున్నారు. బల్దియాలో ఏర్పాటు చేసిన 600 కేంద్రాల్లో ఎక్కడ చూసినా అర్జీదారులతో కోలాహలం నెలకొంది. అభయహస్తం గ్యారెంటీలకు తోడు రేషన్ కార్డు కోసం ప్రజలు భారీగా దరఖాస్తు(Praja Palana Application) చేసుకుంటున్నారు. తెల్లకాగితంపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రేషన్‌ కార్డు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నారు. గ్రేటర్‌ పరిధి ఆరు జోన్లలో కలిపి 3,13,226 దరఖాస్తులు వచ్చాయి.

కొనసాగుతున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ - ఫామ్స్ లేక ప్రజలకు అగచాట్లు

Praja Palana Program Second Day Response : : ముషీరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా గ్యారెంటీల కోసం, ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి పథకానికి ప్రత్యేక దరఖాస్తు అవసరమా అని అధికారుల నుంచి సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు. ఫారాల కోసం జిరాక్స్ కేంద్రాలకు జనం పోటెత్తుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్​లో డిమాండ్‌కు సరిపడా అభయాస్తం దరఖాస్తులను సమకూర్చడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

Huge Response Praja Palana in Telangana : ఫలితంగా జిరాక్స్ సెంటర్ల నుంచి ఒక్కో దరఖాస్తును రూ.40లకు కొనుగోలు చేసి తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించిందని అర్జీదారులు వాపోతున్నారు. చాలా ప్రాంతాల్లో అభయాస్తం దరఖాస్తులు అందక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిపడినన్ని అప్లికేషన్ ఫారాలు రానందునే, ప్రజలు జిరాక్స్ సెంటర్ల వద్ద కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని ప్రజాపాలన సిబ్బంది వివరించారు. ఉచితంగా అభయహస్తం ఫారాలను అందించాలని ప్రజలు కోరుతున్నారు.

"రేషన్​ కార్డులో మా పిల్లల పేర్లు చేర్చేందుకు వచ్చాను. ఇప్పటికే మండల కార్యాలయంలో రెండు సార్లు దరఖాస్తు పెట్టాను. ఇది మూడోసారి. అధికారులు అప్లికేషన్​ నింపుతున్నారు. ఇప్పటికైనా నా సమస్య తీరుతుందని అనుకుంటున్నాను."- దరఖాస్తుదారులు

ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాల్టీ పరిధిలో ప్రజాపాలన సదస్సులను, మెదక్ జిల్లా నోడల్ అధికారి సంగీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వృద్ధులు, మహిళలకు సాయపడాలని తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బీర్నందిలో ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొన్నారు. గ్రామస్తుల వద్ద దరఖాస్తులను స్వీకరించి అధికారులకు అందజేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండవంతపురంలో ప్రజాపాలన సదస్సుకు ఎమ్మెల్యే నాగరాజు హాజరయ్యారు. వందశాతం అర్హులైనవారికి అభయాస్తం ఫలాలు అందజేస్తామన్నారు.

'ప్రజాపాలన'లో అధికారుల అలసత్వం - ఆగ్రహానికి గురవుతున్న జనం

Praja Palana Telangana 2023 : కుటుంబానికి ఒకే దరఖాస్తు సమర్పించాలని ప్రజాపాలన ఆరు గ్యారెంటీల కార్యక్రమం ప్రత్యేక అధికారి రఘునందన్‌రావు అన్నారు. ఖమ్మంలో జరుగుతున్న దరఖాస్తుల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ప్రజాపాలన కార్యక్రమంలో అర్జీ ఇస్తూ గుండెపోటుతో ఒకరు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్‌లో జరిగింది. లక్ష్మయ్య అనే వ్యక్తి సదస్సులో నిలబడి కుప్పకూలిపోగా స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించే లోపే మృతిచెందారు.

ప్రజాపాలనకు విశేష స్పందన- తొలిరోజు 7,46,414 అప్లికేషన్లు

ప్రజాపాలన కార్యక్రమంలో గలాటా - ఎంపీపీ, ప్రజల మధ్య వాగ్వాదం

ప్రజాపాలన దరఖాస్తుల వెల్లువ రెండో రోజు 8,12,862 అప్లికేషన్లు

Praja palana Second Day Applications in Telangana : ప్రజాపాలన సదస్సులో దరఖాస్తుల వెల్లువ కొనసాగుతోంది. ఐదు గ్యారెంటీ పథకాల కోసం రాష్ట్రవ్యాప్తంగా రెండురోజుల్లో 15,59,276 దరఖాస్తులు వచ్చాయి. మొదటిరోజు 7,46,414 దరఖాస్తులు రాగా శుక్రవారం 8,12,862 వచ్చాయి. జీహెచ్​ఎంసీ, ఇతర కార్పొరేషన్లు, పట్టణాల్లో 4,89,000 దరఖస్తులు, గ్రామాల్లో 3,23,862 వచ్చాయి.

దరఖాస్తులు తామే ఉచితంగా ఇస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ, కేంద్రాల సమీపంలో బయటి వ్యక్తులు రూ.20 నుంచి రూ.100 వరకు ఫారాలను అమ్ముతున్నారు. మరోవైపు దరఖాస్తుల్లో నింపాల్సిన అంశాలు, పథకాలకు సంబంధించిన నిబంధనలపై ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. అధికారులు ఒక్కొక్కరు ఒక్కోతీరుగా చెబుతుండడం మరింత గందరగోళానికి దారితీస్తోంది.

జీహెచ్​ఎంసీలో రెండో రోజు భారీగా అభయహస్తం దరఖాస్తులు - ఎక్కువగా వాటి కోసమే

Second Day Praja palana Applications : ప్రజాపాలనపై రెండో రోజూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జనం నుంచి విశేష స్పందన లభిస్తున్నందున ప్రజా సదస్సులలో ఎదురైన సమస్యలను(Praja Palana Issues Telangana) పునరావృతం కాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకున్నారని సీఎస్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తు ఫారాలు విక్రయించకుండా చూడాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ప్రజాపాలన కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను శాంతి కుమారి ఆదేశించారు.

రేషన్​ కార్డుకు దరఖాస్తులు : అభయహస్తం దరఖాస్తులకు రాజధాని వాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రభుత్వం ఆహ్వానించిన ఐదు గ్యారెంటీల్లో నగరవాసులు మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల కోసం పెద్ద సంఖ్యలో అర్జీలు పెట్టుకుంటున్నారు. బల్దియాలో ఏర్పాటు చేసిన 600 కేంద్రాల్లో ఎక్కడ చూసినా అర్జీదారులతో కోలాహలం నెలకొంది. అభయహస్తం గ్యారెంటీలకు తోడు రేషన్ కార్డు కోసం ప్రజలు భారీగా దరఖాస్తు(Praja Palana Application) చేసుకుంటున్నారు. తెల్లకాగితంపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రేషన్‌ కార్డు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నారు. గ్రేటర్‌ పరిధి ఆరు జోన్లలో కలిపి 3,13,226 దరఖాస్తులు వచ్చాయి.

కొనసాగుతున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ - ఫామ్స్ లేక ప్రజలకు అగచాట్లు

Praja Palana Program Second Day Response : : ముషీరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా గ్యారెంటీల కోసం, ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి పథకానికి ప్రత్యేక దరఖాస్తు అవసరమా అని అధికారుల నుంచి సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు. ఫారాల కోసం జిరాక్స్ కేంద్రాలకు జనం పోటెత్తుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్​లో డిమాండ్‌కు సరిపడా అభయాస్తం దరఖాస్తులను సమకూర్చడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

Huge Response Praja Palana in Telangana : ఫలితంగా జిరాక్స్ సెంటర్ల నుంచి ఒక్కో దరఖాస్తును రూ.40లకు కొనుగోలు చేసి తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించిందని అర్జీదారులు వాపోతున్నారు. చాలా ప్రాంతాల్లో అభయాస్తం దరఖాస్తులు అందక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిపడినన్ని అప్లికేషన్ ఫారాలు రానందునే, ప్రజలు జిరాక్స్ సెంటర్ల వద్ద కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని ప్రజాపాలన సిబ్బంది వివరించారు. ఉచితంగా అభయహస్తం ఫారాలను అందించాలని ప్రజలు కోరుతున్నారు.

"రేషన్​ కార్డులో మా పిల్లల పేర్లు చేర్చేందుకు వచ్చాను. ఇప్పటికే మండల కార్యాలయంలో రెండు సార్లు దరఖాస్తు పెట్టాను. ఇది మూడోసారి. అధికారులు అప్లికేషన్​ నింపుతున్నారు. ఇప్పటికైనా నా సమస్య తీరుతుందని అనుకుంటున్నాను."- దరఖాస్తుదారులు

ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాల్టీ పరిధిలో ప్రజాపాలన సదస్సులను, మెదక్ జిల్లా నోడల్ అధికారి సంగీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వృద్ధులు, మహిళలకు సాయపడాలని తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బీర్నందిలో ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొన్నారు. గ్రామస్తుల వద్ద దరఖాస్తులను స్వీకరించి అధికారులకు అందజేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండవంతపురంలో ప్రజాపాలన సదస్సుకు ఎమ్మెల్యే నాగరాజు హాజరయ్యారు. వందశాతం అర్హులైనవారికి అభయాస్తం ఫలాలు అందజేస్తామన్నారు.

'ప్రజాపాలన'లో అధికారుల అలసత్వం - ఆగ్రహానికి గురవుతున్న జనం

Praja Palana Telangana 2023 : కుటుంబానికి ఒకే దరఖాస్తు సమర్పించాలని ప్రజాపాలన ఆరు గ్యారెంటీల కార్యక్రమం ప్రత్యేక అధికారి రఘునందన్‌రావు అన్నారు. ఖమ్మంలో జరుగుతున్న దరఖాస్తుల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ప్రజాపాలన కార్యక్రమంలో అర్జీ ఇస్తూ గుండెపోటుతో ఒకరు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్‌లో జరిగింది. లక్ష్మయ్య అనే వ్యక్తి సదస్సులో నిలబడి కుప్పకూలిపోగా స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించే లోపే మృతిచెందారు.

ప్రజాపాలనకు విశేష స్పందన- తొలిరోజు 7,46,414 అప్లికేషన్లు

ప్రజాపాలన కార్యక్రమంలో గలాటా - ఎంపీపీ, ప్రజల మధ్య వాగ్వాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.