ETV Bharat / state

LOCK DOWN: రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు

author img

By

Published : May 31, 2021, 10:10 PM IST

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను జూన్‌ 9 వరకు పెంచిన నేపథ్యంలో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సడలింపుల మేరకు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా రవాణాకు అనుమతిస్తున్నారు. అకారణంగా రోడ్ల మీదకు వాహనాలు వస్తే సీజ్‌ చేస్తున్న పోలీసులు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఈ-పాస్‌లు తప్పనిసరని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు
రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు
రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారు. సడలింపు సమయంలో హైదరాబాద్‌లో వాహనాల రాకపోకలు పెరిగాయి. సాధారణ రోజుల్లాగానే పలు కూడళ్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. అమీర్‌పేట, కోఠి, బేగంబజార్, చింతల్‌బస్తీ, సికింద్రాబాద్, కూకట్‌పల్లిలో వాహనాల రద్దీ ఏర్పడింది. లాక్‌డౌన్ సడలింపు సమయాన్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించడంతో వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగాయి. విక్రయాలు, కొనుగోళ్ల కోసం వచ్చే వాళ్లతో రహదారులు, వ్యాపార సముదాయాలు రద్దీగా కనిపించాయి. లాక్‌డౌన్‌ సడలింపు సమయం పూర్తయినా ప్రధాన రహదారుల్లో వాహన సంచారం ఎక్కువగానే కనిపిస్తోంది. రవీంద్ర భారతి కూడలి వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. అకారణంగా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలు సీజ్‌ చేశారు. తనిఖీలను మధ్య మండలం డీసీపీ, నగర అదనపు పోలీస్‌ కమిషనర్ విశ్వప్రసాద్ పర్యవేక్షించారు.

ఎక్కడికక్కడ బారికేడ్లు..

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని వాహనచోదకులపై కేసులు నమోదు చేశారు. వ్యాపార సముదాయాల్లో మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధించారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో లాక్‌డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 తర్వాత బయటకు వచ్చిన వారిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. మహబూబాబాద్‌లో ఒంటి గంటకే వ్యాపార వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పలు కూడళ్లు, చెక్ పోస్టులను సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. నిబంధనలు పాటించి లాక్‌డౌన్‌కు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కఠిన చర్యలు..

సంగారెడ్డి నియోజకవర్గంలో లాక్‌డౌన్ పటిష్ఠంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 తర్వాత రోడ్డుపైకి వాహనాలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకి రావొద్దని ప్రభుత్వ చర్యలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదిలాబాద్‌లోనూ లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి.

ఇదీ చూడండి: Vaccination : జూన్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు టీకా

రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారు. సడలింపు సమయంలో హైదరాబాద్‌లో వాహనాల రాకపోకలు పెరిగాయి. సాధారణ రోజుల్లాగానే పలు కూడళ్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. అమీర్‌పేట, కోఠి, బేగంబజార్, చింతల్‌బస్తీ, సికింద్రాబాద్, కూకట్‌పల్లిలో వాహనాల రద్దీ ఏర్పడింది. లాక్‌డౌన్ సడలింపు సమయాన్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించడంతో వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగాయి. విక్రయాలు, కొనుగోళ్ల కోసం వచ్చే వాళ్లతో రహదారులు, వ్యాపార సముదాయాలు రద్దీగా కనిపించాయి. లాక్‌డౌన్‌ సడలింపు సమయం పూర్తయినా ప్రధాన రహదారుల్లో వాహన సంచారం ఎక్కువగానే కనిపిస్తోంది. రవీంద్ర భారతి కూడలి వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. అకారణంగా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలు సీజ్‌ చేశారు. తనిఖీలను మధ్య మండలం డీసీపీ, నగర అదనపు పోలీస్‌ కమిషనర్ విశ్వప్రసాద్ పర్యవేక్షించారు.

ఎక్కడికక్కడ బారికేడ్లు..

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని వాహనచోదకులపై కేసులు నమోదు చేశారు. వ్యాపార సముదాయాల్లో మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధించారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో లాక్‌డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 తర్వాత బయటకు వచ్చిన వారిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. మహబూబాబాద్‌లో ఒంటి గంటకే వ్యాపార వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పలు కూడళ్లు, చెక్ పోస్టులను సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. నిబంధనలు పాటించి లాక్‌డౌన్‌కు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కఠిన చర్యలు..

సంగారెడ్డి నియోజకవర్గంలో లాక్‌డౌన్ పటిష్ఠంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 తర్వాత రోడ్డుపైకి వాహనాలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకి రావొద్దని ప్రభుత్వ చర్యలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదిలాబాద్‌లోనూ లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి.

ఇదీ చూడండి: Vaccination : జూన్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు టీకా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.