ETV Bharat / state

'కాంట్రాక్టు పేరిట ఉద్యోగుల జీవితాలతో చెలగాటం'

author img

By

Published : Sep 5, 2019, 12:08 PM IST

కాంట్రాక్టు ఉద్యోగులమనే సాకుతో తమను ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని రాష్ట్ర సోషల్ ఆడిట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

గ్రామీణాభివృద్ధి కార్యాలయాన్నిముట్టడించిన సోషల్ ఆడిట్ ఉద్యోగులు

తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర సోషల్ ఆడిట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. సుదీర్ఘకాలంగా సంస్థలో పనిచేస్తున్న తమ పట్ల ఉన్నతాధికారులు వివక్షత చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు పేరిట తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని రాష్ట్ర సోషల్ ఆడిట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వెలిబుచ్చారు. అధికారులు తమపై అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్​ ట్యాంక్ బండ్​లోని గ్రామీణాభివృద్ధి కార్యాలయాన్ని సోషల్ ఆడిట్ బిఆర్పీ, డీఆర్​పీ ఉద్యోగులు ముట్టడించారు.

పన్నెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నా...

తమ సమస్యల పరిష్కారం కోసం కొందరు అధికారులు, డైరెక్టర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ ఉద్యోగి పెట్రోలు సీసాతో ఆత్మహత్యకు విఫలయత్నం చేశాడు. గతంలో ఇదే కార్యాలయంలో ఈ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడనే సమాచారం మేరకు అతని బ్యాగును పోలీసులు తనిఖీ చేశారు. పెట్రోల్ బాటల్​ను గాంధీనగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత 12 ఏళ్లుగా తాము విధులు నిర్వహిస్తున్నా...నాటి నుంచి అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.

హామీ ఇస్తేనే విధులకు హాజరవుతాం

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి తమకు న్యాయం జరిగే వరకు రాజీలేని పోరాటం చేస్తామని రాష్ట్ర సోషల్ ఆడిట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్పష్టం చేసింది. సంస్థ డైరెక్టర్ నుంచి స్పష్టమైన హామీ రాకపోయేసరికి వారు వెనుదిరిగారు. మూడు నెలలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పనిలోకి తీసుకోవాలని ఆ మేరకు హామీ ఇస్తేనే విధులకు హాజరవుతామని తేల్చి చెప్పారు. ఇందుకు డైరెక్టర్ అంగీకరించట్లేదని...ఉద్యోగులందరికీ ఒకే రకమైన నియమాలు వర్తింపచేయాలని వారు కోరారు. ఈ విషయంలో వెనుకంజ వేసేదే లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు రాజీలేని పోరాటం చేస్తామని రాష్ట్ర సోషల్ ఆడిట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్పష్టం చేసింది.

గ్రామీణాభివృద్ధి కార్యాలయాన్నిముట్టడించిన సోషల్ ఆడిట్ ఉద్యోగులు

ఇవీ చూడండి : అరుదైన సంఘటన... 73 ఏళ్లకు గర్భం దాల్చిన వృద్ధురాలు

తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర సోషల్ ఆడిట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. సుదీర్ఘకాలంగా సంస్థలో పనిచేస్తున్న తమ పట్ల ఉన్నతాధికారులు వివక్షత చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు పేరిట తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని రాష్ట్ర సోషల్ ఆడిట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వెలిబుచ్చారు. అధికారులు తమపై అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్​ ట్యాంక్ బండ్​లోని గ్రామీణాభివృద్ధి కార్యాలయాన్ని సోషల్ ఆడిట్ బిఆర్పీ, డీఆర్​పీ ఉద్యోగులు ముట్టడించారు.

పన్నెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నా...

తమ సమస్యల పరిష్కారం కోసం కొందరు అధికారులు, డైరెక్టర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ ఉద్యోగి పెట్రోలు సీసాతో ఆత్మహత్యకు విఫలయత్నం చేశాడు. గతంలో ఇదే కార్యాలయంలో ఈ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడనే సమాచారం మేరకు అతని బ్యాగును పోలీసులు తనిఖీ చేశారు. పెట్రోల్ బాటల్​ను గాంధీనగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత 12 ఏళ్లుగా తాము విధులు నిర్వహిస్తున్నా...నాటి నుంచి అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.

హామీ ఇస్తేనే విధులకు హాజరవుతాం

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి తమకు న్యాయం జరిగే వరకు రాజీలేని పోరాటం చేస్తామని రాష్ట్ర సోషల్ ఆడిట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్పష్టం చేసింది. సంస్థ డైరెక్టర్ నుంచి స్పష్టమైన హామీ రాకపోయేసరికి వారు వెనుదిరిగారు. మూడు నెలలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పనిలోకి తీసుకోవాలని ఆ మేరకు హామీ ఇస్తేనే విధులకు హాజరవుతామని తేల్చి చెప్పారు. ఇందుకు డైరెక్టర్ అంగీకరించట్లేదని...ఉద్యోగులందరికీ ఒకే రకమైన నియమాలు వర్తింపచేయాలని వారు కోరారు. ఈ విషయంలో వెనుకంజ వేసేదే లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు రాజీలేని పోరాటం చేస్తామని రాష్ట్ర సోషల్ ఆడిట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్పష్టం చేసింది.

గ్రామీణాభివృద్ధి కార్యాలయాన్నిముట్టడించిన సోషల్ ఆడిట్ ఉద్యోగులు

ఇవీ చూడండి : అరుదైన సంఘటన... 73 ఏళ్లకు గర్భం దాల్చిన వృద్ధురాలు

Intro:సోషల్ ఆడిట్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు


Body:సోషల్ ఆడిట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో డైరెక్టర్ హామీ మేరకు సాంగ్ విధుల్లోకి హాజరవుతానని వచ్చిన తమ పట్ల ఆ డైరెక్టర్ నిరాకరించారు దీంతో ఉద్యోగులు హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లోని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయం ను ఉద్యోగులు ముట్టడించారు తమ సమస్యల పరిష్కారం విషయంలో గత కొన్ని రోజులుగా ఆందోళన చేపట్టాలని తమ ఆందోళన పట్ల రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ సానుకూలంగా స్పందించడం లేదని వారు ఆరోపించారు గత 12 సంవత్సరాలుగా తమ్ము విధులు నిర్వహిస్తున్న ఆనాటినుండి ఇ అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న తాము వాటిని ఎదుర్కొంటూ విధులను నిర్వర్తించారు అని ఉద్యోగులు తెలిపారు.... ఈనెల 29వ తేదీన రూరల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ఉద్యోగులు ముట్టడించారు ఈ నేపథ్యంలో కొంత మేరకు చర్చలు సఫలమై,,న కొన్ని షరతులతో తమను విధుల్లోకి తీసుకుంటామని డైరెక్టర్ చెప్పారని అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు...... ప్రధానంగా మూడు నెలలు గా కాంట్రాక్టుపై పనిచేస్తున్న ఉద్యోగులను కూడా విధుల్లోకి తీసుకోవాలని ఆ మేరకు హామీ ఇస్తే తాము విధులకు హాజరవుతారని ఉద్యోగులు కరాఖండిగా గా చెప్పారు... కానీ డైరెక్టర్ అందుకు అంగీకరించడం లేదని ఉద్యోగులందరికీ ఒకే విధంగా గా నియమాలు ఉండాలని వారు కోరారు ఈ విషయంలో తాము వెనుకంజ వేసేది లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు తమ సమస్యల సాధనకు ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధమని వారు హెచ్చరించారు....


బైట్..... అంజయ్య అసోసియేషన్ ఉపాధ్యక్షుడు..
బైట్..... లావణ్య బి ఆర్ పి,,
బైట్... గీత డి ఆర్ పి..



Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.