ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ పెన్షనర్ల నిరసన

తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ పెన్షనర్లు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్​ ఇందిరా పార్కు ధర్నాచౌక్​ వద్ద నిరసనకు దిగారు. సర్కారు సమస్యలు పరిష్కరించకుంటే దశల వారీగా పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

author img

By

Published : Jul 25, 2019, 8:37 PM IST

పెన్షనర్ల నిరసన

హైదరాబాద్​ ఇందిరాపార్కు ధర్నాచౌక్​ వద్ద రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్​ సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం పెన్షనర్ల సమస్యల విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నర్సిరెడ్డి డిమాండ్​ చేశారు. సమస్యల సాధనకై సంఘాల నాయకులతో చర్చించాలని సర్కారుకు విన్నవించారు. పెన్షనర్లకు ఐఆర్​ 27 శాతం పథకం కింద రూ. 400 కోట్లు కేటాయించాలని డిమాండ్​ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు దశల వారీగా పోరాటం కొనసాగిస్తామని మాజీ ఉద్యోగులు స్పష్టం చేశారు.

సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ పెన్షనర్ల నిరసన

ఇదీ చూడండి : ధర్నాచౌక్​ వద్ద తెదేపా నేతల ఆందోళన... అరెస్టు

హైదరాబాద్​ ఇందిరాపార్కు ధర్నాచౌక్​ వద్ద రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్​ సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం పెన్షనర్ల సమస్యల విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నర్సిరెడ్డి డిమాండ్​ చేశారు. సమస్యల సాధనకై సంఘాల నాయకులతో చర్చించాలని సర్కారుకు విన్నవించారు. పెన్షనర్లకు ఐఆర్​ 27 శాతం పథకం కింద రూ. 400 కోట్లు కేటాయించాలని డిమాండ్​ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు దశల వారీగా పోరాటం కొనసాగిస్తామని మాజీ ఉద్యోగులు స్పష్టం చేశారు.

సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ పెన్షనర్ల నిరసన

ఇదీ చూడండి : ధర్నాచౌక్​ వద్ద తెదేపా నేతల ఆందోళన... అరెస్టు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.